నిర్మల్లో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం
నిర్మల్లో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం
Editor Desk
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసులు అందించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యం, రహదారులు, సాగునీటి రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
జిల్లా అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కళారూపాలు ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి