నిజాయితీ చాటుకున్న కోదాడ ఆర్టీసీ కండక్టర్
కోదాడ డిపోకు చెందిన కండక్టర్ జి. శ్రీధర్ తన నిజాయితీతో ఆదర్శంగా నిలిచారు. కోదాడ నుంచి ముదిగొండకు వెళ్తున్న బస్సులో ఒక ప్రయాణికురాలు మర్చిపోయిన ఐదు గ్రాముల బంగారు మాటీలను ఆయన గుర్తించారు. వాటిని సురక్షితంగా డిపోకు తీసుకువచ్చి అధికారులకు అప్పగించారు. విచారణ అనంతరం అసలు యజమానికి కోదాడ ఆర్టీసీ డిపో కార్యాలయంలో డిపో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ సమక్షంలో ఆ బంగారాన్ని తిరిగి అందజేశారు.శ్రీధర్ నిజాయితీని డిపో మేనేజర్ శ్రీనివాస్, తోటి ఉద్యోగులు అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి