నేటి నుంచి డివిజన్ స్థాయిలో 'ప్రజావాణి'
నేటి నుంచి డివిజన్ స్థాయిలో 'ప్రజావాణి'
K.RAVI
చౌటుప్పల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణ
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సోమవారం రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు మే 4 (సోమవారం) నుండి చౌటుప్పల్ డివిజన్ పరిధిలో అర్జీల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
వేదిక: ఎంపీడీఓ కార్యాలయ మీటింగ్ హాల్
చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరం నందు నిర్వహించనున్నారు. డివిజన్ పరిధిలోని ఐదు మండలాల ప్రజలు తమ సమస్యలపై ఇక్కడ విన్నవించుకోవచ్చు.
ఏయే మండలాల వారంటే..?
చౌటుప్పల్, నారాయణపురం
బి.పోచంపల్లి, వలిగొండ,
రామన్నపేట తమ పరిధిలోని మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, క్షేత్రస్థాయిలో పరిష్కారం కాని సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి