Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:00 AM

నేటి నుంచి డివిజన్ స్థాయిలో 'ప్రజావాణి'

నేటి నుంచి డివిజన్ స్థాయిలో 'ప్రజావాణి'

నేటి నుంచి డివిజన్ స్థాయిలో 'ప్రజావాణి'
02-05-2026 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణ

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సోమవారం రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు మే 4 (సోమవారం) నుండి చౌటుప్పల్ డివిజన్ పరిధిలో అర్జీల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

వేదిక: ఎంపీడీఓ కార్యాలయ మీటింగ్ హాల్

చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరం నందు నిర్వహించనున్నారు. డివిజన్ పరిధిలోని ఐదు మండలాల ప్రజలు తమ సమస్యలపై ఇక్కడ విన్నవించుకోవచ్చు.

ఏయే మండలాల వారంటే..?

చౌటుప్పల్, ​నారాయణపురం

​బి.పోచంపల్లి, ​వలిగొండ,

​రామన్నపేట తమ పరిధిలోని మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, క్షేత్రస్థాయిలో పరిష్కారం కాని సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది.

Sthanikam

నేటి నుంచి డివిజన్ స్థాయిలో 'ప్రజావాణి'

Article Image

చౌటుప్పల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణ

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సోమవారం రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు మే 4 (సోమవారం) నుండి చౌటుప్పల్ డివిజన్ పరిధిలో అర్జీల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

వేదిక: ఎంపీడీఓ కార్యాలయ మీటింగ్ హాల్

చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరం నందు నిర్వహించనున్నారు. డివిజన్ పరిధిలోని ఐదు మండలాల ప్రజలు తమ సమస్యలపై ఇక్కడ విన్నవించుకోవచ్చు.

ఏయే మండలాల వారంటే..?

చౌటుప్పల్, ​నారాయణపురం

​బి.పోచంపల్లి, ​వలిగొండ,

​రామన్నపేట తమ పరిధిలోని మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, క్షేత్రస్థాయిలో పరిష్కారం కాని సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News