Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:00 AM

నేటి బాలలే.. రేపటి పౌరులు!

నేటి బాలలే.. రేపటి పౌరులు!

నేటి బాలలే.. రేపటి పౌరులు!
14-04-2026 133 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మల్లికార్జున ఒలంపియాడ్ స్కూల్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే

చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేసిన మున్సిపల్ చైర్మన్ పావని రమేష్ గౌడ్

చిన్నతనం నుంచే క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లికార్జున ఒలంపియాడ్ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఆమె ముఖ్య అతిథిగా హాజరై, చిన్నారి విద్యార్థులకు తన చేతుల మీదుగా పట్టాలను అందజేశారు.​ఈ సందర్భంగా పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి పౌరులని, వారిని ఉత్తమ విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత పాఠశాలలు, తల్లిదండ్రులపై ఉందన్నారు. ఉన్నత విలువలతో చదువుకున్న వారు సమాజంలో ఉన్నత పదవులను అధిష్టించి, దేశ సేవలో భాగస్వాములవుతారని ఆకాంక్షించారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్, ఎంఈఓ గురువారావు, మల్లికార్జున హై స్కూల్ చైర్మన్ మారపల్లి మల్లారెడ్డి, పాఠశాల డైరెక్టర్లు భీమిడి ధరణి, మారెపల్లి తేజస్విని, ప్రిన్సిపాల్ కన్నయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

నేటి బాలలే.. రేపటి పౌరులు!

Article Image

మల్లికార్జున ఒలంపియాడ్ స్కూల్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే

చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేసిన మున్సిపల్ చైర్మన్ పావని రమేష్ గౌడ్

చిన్నతనం నుంచే క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లికార్జున ఒలంపియాడ్ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఆమె ముఖ్య అతిథిగా హాజరై, చిన్నారి విద్యార్థులకు తన చేతుల మీదుగా పట్టాలను అందజేశారు.​ఈ సందర్భంగా పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి పౌరులని, వారిని ఉత్తమ విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత పాఠశాలలు, తల్లిదండ్రులపై ఉందన్నారు. ఉన్నత విలువలతో చదువుకున్న వారు సమాజంలో ఉన్నత పదవులను అధిష్టించి, దేశ సేవలో భాగస్వాములవుతారని ఆకాంక్షించారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్, ఎంఈఓ గురువారావు, మల్లికార్జున హై స్కూల్ చైర్మన్ మారపల్లి మల్లారెడ్డి, పాఠశాల డైరెక్టర్లు భీమిడి ధరణి, మారెపల్లి తేజస్విని, ప్రిన్సిపాల్ కన్నయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News