నేటి బాలలే.. రేపటి పౌరులు!
నేటి బాలలే.. రేపటి పౌరులు!
K.RAVI
మల్లికార్జున ఒలంపియాడ్ స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేసిన మున్సిపల్ చైర్మన్ పావని రమేష్ గౌడ్
చిన్నతనం నుంచే క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లికార్జున ఒలంపియాడ్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఆమె ముఖ్య అతిథిగా హాజరై, చిన్నారి విద్యార్థులకు తన చేతుల మీదుగా పట్టాలను అందజేశారు.ఈ సందర్భంగా పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి పౌరులని, వారిని ఉత్తమ విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత పాఠశాలలు, తల్లిదండ్రులపై ఉందన్నారు. ఉన్నత విలువలతో చదువుకున్న వారు సమాజంలో ఉన్నత పదవులను అధిష్టించి, దేశ సేవలో భాగస్వాములవుతారని ఆకాంక్షించారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్, ఎంఈఓ గురువారావు, మల్లికార్జున హై స్కూల్ చైర్మన్ మారపల్లి మల్లారెడ్డి, పాఠశాల డైరెక్టర్లు భీమిడి ధరణి, మారెపల్లి తేజస్విని, ప్రిన్సిపాల్ కన్నయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి