నేతన్నలకు ఆరోగ్య భద్రత మెగా వైద్య శిబిరం 75 మందికి పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ
నేతన్నలకు ఆరోగ్య భద్రత మెగా వైద్య శిబిరం 75 మందికి పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ
Editor Desk
రామన్నపేట మండల కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో చేనేత కార్మికుల కోసం “నేతన్నకు ఆరోగ్య భద్రత మెగా వైద్య శిబిరం” నిర్వహించారు. ఈ శిబిరాన్ని సర్పంచ్ గారిక సత్యనారాయణ ప్రారంభించారు.
శిబిరంలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, కంటి విభాగాలకు చెందిన నిపుణ వైద్యులు సేవలందించారు. వివిధ రకాల రక్త పరీక్షలు నిర్వహించడంతో పాటు శ్వాసకోశ సమస్యలున్న వారికి ఛెస్ట్ ఎక్స్రేలు తీశారు.
మొత్తం 75 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో 50 మంది పురుషులు, 25 మంది మహిళలు ఉన్నారు. బాధితులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘ అధ్యక్షుడు జెల్ల వెంకటేష్, పట్టణ శాఖ అధ్యక్షుడు రచ్చ యాదగిరి, వైద్యాధికారి డాక్టర్ అశ్విని కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సుమన్ కళ్యాణ్, హెచ్ఈఓ గోపాల్, సూపర్వైజర్ వాణిశ్రీ, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి