Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:19 AM

నేతన్నలకు ఆరోగ్య భద్రత మెగా వైద్య శిబిరం 75 మందికి పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

నేతన్నలకు ఆరోగ్య భద్రత మెగా వైద్య శిబిరం 75 మందికి పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

నేతన్నలకు ఆరోగ్య భద్రత మెగా వైద్య శిబిరం   75 మందికి పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ
05-05-2026 82 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో చేనేత కార్మికుల కోసం “నేతన్నకు ఆరోగ్య భద్రత మెగా వైద్య శిబిరం” నిర్వహించారు. ఈ శిబిరాన్ని సర్పంచ్ గారిక సత్యనారాయణ ప్రారంభించారు.

శిబిరంలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, కంటి విభాగాలకు చెందిన నిపుణ వైద్యులు సేవలందించారు. వివిధ రకాల రక్త పరీక్షలు నిర్వహించడంతో పాటు శ్వాసకోశ సమస్యలున్న వారికి ఛెస్ట్ ఎక్స్‌రేలు తీశారు.

మొత్తం 75 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో 50 మంది పురుషులు, 25 మంది మహిళలు ఉన్నారు. బాధితులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘ అధ్యక్షుడు జెల్ల వెంకటేష్, పట్టణ శాఖ అధ్యక్షుడు రచ్చ యాదగిరి, వైద్యాధికారి డాక్టర్ అశ్విని కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సుమన్ కళ్యాణ్, హెచ్‌ఈఓ గోపాల్, సూపర్వైజర్ వాణిశ్రీ, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

నేతన్నలకు ఆరోగ్య భద్రత మెగా వైద్య శిబిరం 75 మందికి పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

Article Image

రామన్నపేట మండల కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో చేనేత కార్మికుల కోసం “నేతన్నకు ఆరోగ్య భద్రత మెగా వైద్య శిబిరం” నిర్వహించారు. ఈ శిబిరాన్ని సర్పంచ్ గారిక సత్యనారాయణ ప్రారంభించారు.

శిబిరంలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, కంటి విభాగాలకు చెందిన నిపుణ వైద్యులు సేవలందించారు. వివిధ రకాల రక్త పరీక్షలు నిర్వహించడంతో పాటు శ్వాసకోశ సమస్యలున్న వారికి ఛెస్ట్ ఎక్స్‌రేలు తీశారు.

మొత్తం 75 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో 50 మంది పురుషులు, 25 మంది మహిళలు ఉన్నారు. బాధితులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘ అధ్యక్షుడు జెల్ల వెంకటేష్, పట్టణ శాఖ అధ్యక్షుడు రచ్చ యాదగిరి, వైద్యాధికారి డాక్టర్ అశ్విని కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సుమన్ కళ్యాణ్, హెచ్‌ఈఓ గోపాల్, సూపర్వైజర్ వాణిశ్రీ, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News