Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రo ప్రారంభించిన చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 05, 2026 04:09 PM

నేతన్నలకు ఆరోగ్య భద్రత మెగా వైద్య శిబిరం 75 మందికి పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

నేతన్నలకు ఆరోగ్య భద్రత మెగా వైద్య శిబిరం 75 మందికి పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

నేతన్నలకు ఆరోగ్య భద్రత మెగా వైద్య శిబిరం   75 మందికి పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ
May 05, 2026 02:52 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో చేనేత కార్మికుల కోసం “నేతన్నకు ఆరోగ్య భద్రత మెగా వైద్య శిబిరం” నిర్వహించారు. ఈ శిబిరాన్ని సర్పంచ్ గారిక సత్యనారాయణ ప్రారంభించారు.

శిబిరంలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, కంటి విభాగాలకు చెందిన నిపుణ వైద్యులు సేవలందించారు. వివిధ రకాల రక్త పరీక్షలు నిర్వహించడంతో పాటు శ్వాసకోశ సమస్యలున్న వారికి ఛెస్ట్ ఎక్స్‌రేలు తీశారు.

మొత్తం 75 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో 50 మంది పురుషులు, 25 మంది మహిళలు ఉన్నారు. బాధితులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘ అధ్యక్షుడు జెల్ల వెంకటేష్, పట్టణ శాఖ అధ్యక్షుడు రచ్చ యాదగిరి, వైద్యాధికారి డాక్టర్ అశ్విని కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సుమన్ కళ్యాణ్, హెచ్‌ఈఓ గోపాల్, సూపర్వైజర్ వాణిశ్రీ, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News