Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:42 PM

నీర్నంల గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

నీర్నంల గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

నీర్నంల గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
14-04-2026 137 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నీర్నంల గ్రామంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన సేవలు, ఆయన చూపిన మార్గం గురించి గ్రామ ప్రజలకు వివరించారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో ప్రజల ప్రాణ భద్రత ముఖ్యమని సూచిస్తూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు.

తదుపరి అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఆశయాలను సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. గ్రామంలో ప్రతి వార్డు పరిధిలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి మిర్యాల లక్ష్మి, ఉపసర్పంచ్ ఆవుల శ్రీశైలం యాదవ్, మాజీ సర్పంచులు గంగుల వెంకటరెడ్డి, ఆవుల పద్మ నరసింహ, మాజీ ఎంపీటీసీలు రామ్, సునీత, శివకుమార్, నాగటి ఉపేందర్, మాజీ ఉపసర్పంచ్ చల్ల అనిత, సత్యప్రకాశ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు మరియు గ్రామపంచాయతీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

నీర్నంల గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

Article Image

: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నీర్నంల గ్రామంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన సేవలు, ఆయన చూపిన మార్గం గురించి గ్రామ ప్రజలకు వివరించారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో ప్రజల ప్రాణ భద్రత ముఖ్యమని సూచిస్తూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు.

తదుపరి అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఆశయాలను సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. గ్రామంలో ప్రతి వార్డు పరిధిలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి మిర్యాల లక్ష్మి, ఉపసర్పంచ్ ఆవుల శ్రీశైలం యాదవ్, మాజీ సర్పంచులు గంగుల వెంకటరెడ్డి, ఆవుల పద్మ నరసింహ, మాజీ ఎంపీటీసీలు రామ్, సునీత, శివకుమార్, నాగటి ఉపేందర్, మాజీ ఉపసర్పంచ్ చల్ల అనిత, సత్యప్రకాశ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు మరియు గ్రామపంచాయతీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News