నీర్నంల గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
నీర్నంల గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
Editor Desk
: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నీర్నంల గ్రామంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన సేవలు, ఆయన చూపిన మార్గం గురించి గ్రామ ప్రజలకు వివరించారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో ప్రజల ప్రాణ భద్రత ముఖ్యమని సూచిస్తూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు.
తదుపరి అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఆశయాలను సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. గ్రామంలో ప్రతి వార్డు పరిధిలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి మిర్యాల లక్ష్మి, ఉపసర్పంచ్ ఆవుల శ్రీశైలం యాదవ్, మాజీ సర్పంచులు గంగుల వెంకటరెడ్డి, ఆవుల పద్మ నరసింహ, మాజీ ఎంపీటీసీలు రామ్, సునీత, శివకుమార్, నాగటి ఉపేందర్, మాజీ ఉపసర్పంచ్ చల్ల అనిత, సత్యప్రకాశ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు మరియు గ్రామపంచాయతీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి