Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ముర్కుంజాల్ లో డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు వివేకానంద పాఠశాల 10వ వార్షికోత్సవం ఘనంగా అలరించిన చిన్నారుల నృత్యాలు – గురువులే విద్యార్థుల భవితకు మార్గదర్శకులు అంబేడ్కర్: పుస్తకాలలో కాదు, ప్రస్తుత సమాజంలో పునర్జన్మ పొందాల్సిన ఆలోచన” హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 14, 2026 08:41 PM

నీర్నంల గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

నీర్నంల గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

నీర్నంల గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
April 14, 2026 04:48 PM 85 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నీర్నంల గ్రామంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన సేవలు, ఆయన చూపిన మార్గం గురించి గ్రామ ప్రజలకు వివరించారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో ప్రజల ప్రాణ భద్రత ముఖ్యమని సూచిస్తూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు.

తదుపరి అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఆశయాలను సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. గ్రామంలో ప్రతి వార్డు పరిధిలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి మిర్యాల లక్ష్మి, ఉపసర్పంచ్ ఆవుల శ్రీశైలం యాదవ్, మాజీ సర్పంచులు గంగుల వెంకటరెడ్డి, ఆవుల పద్మ నరసింహ, మాజీ ఎంపీటీసీలు రామ్, సునీత, శివకుమార్, నాగటి ఉపేందర్, మాజీ ఉపసర్పంచ్ చల్ల అనిత, సత్యప్రకాశ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు మరియు గ్రామపంచాయతీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News