నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం అవసరం:
ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజా పాలన' కార్యక్రమంలో భాగంగా గురువారం నేలపట్ల గ్రామంలో మహిళల భద్రత, బాలల రక్షణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ మాట్లాడుతూ, సమాజంలో మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ఆపదలో ఉన్న మహిళలు తక్షణమే పోలీసుల సహాయం పొందేలా 'డైల్ 100' లేదా షీ-టీమ్స్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చిన్నపిల్లలపై జరుగుతున్న అకృత్యాల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, నేరాల నివారణకు గ్రామస్థుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. మహిళలు, బాలల రక్షణ కోసం ఉన్న చట్టాల గురించి గ్రామస్థులకు వివరించారు.ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న పోలీసులు, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
"ప్రతి మహిళా ధైర్యంగా ఉండాలి. నేరాల గురించి సమాచారం ఇచ్చే వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతాం అన్నారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఎస్సై కృషమాల్, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు














































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి