Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:06 AM

నేలపట్లలో 'ప్రజా పాలన': మహిళల భద్రతపై అవగాహన

నేలపట్లలో 'ప్రజా పాలన': మహిళల భద్రతపై అవగాహన

నేలపట్లలో 'ప్రజా పాలన': మహిళల భద్రతపై అవగాహన
01-05-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం అవసరం:

ఇన్‌స్పెక్టర్ మన్మధ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజా పాలన' కార్యక్రమంలో భాగంగా గురువారం నేలపట్ల గ్రామంలో మహిళల భద్రత, బాలల రక్షణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ మాట్లాడుతూ, సమాజంలో మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ఆపదలో ఉన్న మహిళలు తక్షణమే పోలీసుల సహాయం పొందేలా 'డైల్ 100' లేదా షీ-టీమ్స్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చిన్నపిల్లలపై జరుగుతున్న అకృత్యాల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, నేరాల నివారణకు గ్రామస్థుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. మహిళలు, బాలల రక్షణ కోసం ఉన్న చట్టాల గురించి గ్రామస్థులకు వివరించారు.​ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న పోలీసులు, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

​"ప్రతి మహిళా ధైర్యంగా ఉండాలి. నేరాల గురించి సమాచారం ఇచ్చే వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతాం అన్నారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఎస్సై కృషమాల్, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Sthanikam

నేలపట్లలో 'ప్రజా పాలన': మహిళల భద్రతపై అవగాహన

Article Image

నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం అవసరం:

ఇన్‌స్పెక్టర్ మన్మధ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజా పాలన' కార్యక్రమంలో భాగంగా గురువారం నేలపట్ల గ్రామంలో మహిళల భద్రత, బాలల రక్షణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ మాట్లాడుతూ, సమాజంలో మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ఆపదలో ఉన్న మహిళలు తక్షణమే పోలీసుల సహాయం పొందేలా 'డైల్ 100' లేదా షీ-టీమ్స్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చిన్నపిల్లలపై జరుగుతున్న అకృత్యాల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, నేరాల నివారణకు గ్రామస్థుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. మహిళలు, బాలల రక్షణ కోసం ఉన్న చట్టాల గురించి గ్రామస్థులకు వివరించారు.​ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న పోలీసులు, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

​"ప్రతి మహిళా ధైర్యంగా ఉండాలి. నేరాల గురించి సమాచారం ఇచ్చే వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతాం అన్నారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఎస్సై కృషమాల్, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News