Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 10:08 PM

నేడు కామ్రేడ్ గట్టికొప్పుల లింగయ్య 5వ వర్ధంతి

నేడు కామ్రేడ్ గట్టికొప్పుల లింగయ్య 5వ వర్ధంతి

నేడు కామ్రేడ్ గట్టికొప్పుల లింగయ్య 5వ వర్ధంతి
June 01, 2026 04:44 PM 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భూస్వాముల పెత్తందారులకు వ్యతిరేక పోరాటం

ప్రజా సమస్యలపై ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివి

భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ కీర్తిశేషులు గట్టికొప్పుల లింగయ్య గారి 5వ వర్ధంతి సందర్భంగా మోటకొండూరు మండల పరిధిలోని వర్టూరు గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో గట్టికొప్పుల లింగయ్య గారి ఐదవ వర్ధంతి వేడుకలను సిపిఐ మండల కార్యదర్శి గాదగాని మాణిక్యం లింగయ్య గారి స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...వర్టూరు గ్రామానికి చెందిన భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు కీర్తిశేషులు గట్టికొప్పుల లింగయ్య వర్ధంతి కార్యక్రమాన్ని జూన్ 1వ తేదీన మండల కమిటీ,గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా కీర్తిశేషులు కామ్రేడ్ లింగయ్య,బడుగు బలహీన నిరుపేద కుటుంబాల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా వారి వెన్నంటూ ఉండి,1946-1951సంవత్సర మధ్య కాలంలో తన18 సంవత్సరాల వయస్సులోనే భారత కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం పొంది. కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలతో గ్రామస్థాయిలో రైతు సభలను నిర్వహించి రైతులందరినీ సంఘటితం చేసి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భూమికోసం,భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం,భూస్వాముల పెత్తందారులకు వ్యతిరేకంగా అహర్నిశలు పోరాటం చేశారని అన్నారు.పేద ప్రజలు ఆనాడు ఆరుగాలం కష్టపడి గ్రామాల్లో దుక్కి దున్ని వ్యవసాయం చేసి పంట పండిస్తే చేతికొచ్చే సమయంలో భూములపై అక్రమంగా భూషిస్తుల పేరిట,పన్నుల పేరుతో నిలువునా దోచుకుంటున్న నైజాం పాలకులపై భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రైతు సంఘాలుగా ఏర్పాడి వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు అని అన్నారు. భారతీయ కమ్యూనిస్టు పార్టీ మండల కార్యవర్గ సభ్యునిగా అనేక ప్రజా సమస్యలపైన పోరాటం చేశారు.ఇదే వట్టూరు భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో వార్డు మెంబర్ గా,నీటి సంఘం,పాల సంఘం చైర్మన్ గా ఉండి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఆయన అన్నారు. మా మధ్య ఆయన లేకపోయిన వారు పేదలకు చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివి అని ఆయన లేని భారత కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు ఏర్పడిందని కామ్రేడ్ లింగయ్య స్ఫూర్తితోనే కమ్యూనిస్టు పార్టీ బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ గ్రామ శాఖ సెక్రెటరీ సుదగాని వెంకన్న,గ్రామ సర్పంచ్ గట్టికొప్పుల సరిత మచ్చేందర్,గ్రామ ఉప సర్పంచ్ మోర శ్రీనివాస్ రెడ్డి,సిపిఐ మోటకొండూరు మండల సహాయ కార్యదర్శి ముసుకు పెంటారెడ్డి,మండల పార్టీ కార్యవర్గ సభ్యులు,పల్లె వెంకన్న,మంచాల రాధమ్మ,పశువుల నరసింహ,సుదర్శన్,పల్లె శ్రీనివాస్,కర్రే సిద్ధులు,నల్ల రాములు,గువ్వ వెంకన్న, వార్డు సభ్యులు గువ్వ కమలమ్మ,నోముల మహేందర్,గట్టికొప్పుల లక్ష్మీనారాయణ,అమరేందర్,శ్రీనివాస్,గట్టికొప్పుల మల్లయ్య,గువ్వ సిద్దులు కుటుంబ సభ్యులు పవన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News