నల్లగొండలో పశుగ్రాస సంక్షోభం.. పాడి రైతుల గగ్గోలు..!
నల్లగొండలో పశుగ్రాస సంక్షోభం.. పాడి రైతుల గగ్గోలు..!
Komidala Mahender reddy
నల్లగొండ జిల్లాలో తీవ్ర పశుగ్రాస సంక్షోభం నెలకొంది. వరి గడ్డి ధరలు ఆకాశాన్నంటడంతో పశుపోషకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక ట్రాక్టర్ గడ్డి ధర రూ.8 వేలకుపైగా చేరడంతో చిన్న, మధ్య తరగతి రైతులపై భారీ భారం పడుతోంది.
గడ్డి కొరత కారణంగా పశువులకు సరిపడా ఆహారం అందక అవి నీరసంగా మారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోగా, డెయిరీ రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పరిస్థితి మరింత దిగజారడంతో కొందరు రైతులు తమ పశువులను అమ్ముకునే దుస్థితి వచ్చిందని వాపోతున్నారు.
వేసవి తీవ్రతతో గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు తాగునీటి సమస్య కూడా తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో వెంటనే పశుగ్రాస డిపోలు ఏర్పాటు చేసి, రాయితీ ధరలకు గడ్డి అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టకపోతే జిల్లాలో పాడి పరిశ్రమ కుదేలయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి