Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 60 గోవులను పట్టుకున్న పోలీసులు “விஜய் வாக்குறுதிகளை நிறைவேற்றுவார் என நம்புகிறேன்”... ராகுல் காந்தி வாழ்த்து సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ బుక్కపట్నం గ్రామంలో దక్షిణాన నల్లకొండపై 14 వ శతబ్ద ఆలయం కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 11, 2026 12:59 PM

నల్లగొండలో పశుగ్రాస సంక్షోభం.. పాడి రైతుల గగ్గోలు..!

నల్లగొండలో పశుగ్రాస సంక్షోభం.. పాడి రైతుల గగ్గోలు..!

నల్లగొండలో పశుగ్రాస సంక్షోభం.. పాడి రైతుల గగ్గోలు..!
May 11, 2026 10:58 AM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లాలో తీవ్ర పశుగ్రాస సంక్షోభం నెలకొంది. వరి గడ్డి ధరలు ఆకాశాన్నంటడంతో పశుపోషకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక ట్రాక్టర్ గడ్డి ధర రూ.8 వేలకుపైగా చేరడంతో చిన్న, మధ్య తరగతి రైతులపై భారీ భారం పడుతోంది.

గడ్డి కొరత కారణంగా పశువులకు సరిపడా ఆహారం అందక అవి నీరసంగా మారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోగా, డెయిరీ రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పరిస్థితి మరింత దిగజారడంతో కొందరు రైతులు తమ పశువులను అమ్ముకునే దుస్థితి వచ్చిందని వాపోతున్నారు.

వేసవి తీవ్రతతో గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు తాగునీటి సమస్య కూడా తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో వెంటనే పశుగ్రాస డిపోలు ఏర్పాటు చేసి, రాయితీ ధరలకు గడ్డి అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టకపోతే జిల్లాలో పాడి పరిశ్రమ కుదేలయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News