Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 04:46 AM

నల్గొండ జిల్లాలో కలకలం: గంజాయి మత్తులో యువకుడిపై కత్తి దాడి

నల్గొండ జిల్లాలో కలకలం: గంజాయి మత్తులో యువకుడిపై కత్తి దాడి

నల్గొండ జిల్లాలో కలకలం: గంజాయి మత్తులో యువకుడిపై కత్తి దాడి
April 30, 2026 10:07 PM 195 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కాసనగోడు గ్రామంలో గంజాయి మత్తులో కత్తి దాడి ఘటన కలకలం రేపింది. మాచర్ల భరత్ అనే వ్యక్తి, గంజాయి ప్రభావంలో చెరుకు సతీష్ అనే యువకుడిపై కత్తితో దాడి చేసినట్లు సమాచారం.

స్థానికుల ప్రకారం, భరత్ గత కొంతకాలంగా మాదకద్రవ్యాల సరఫరా మరియు గంజాయి కేసుల్లో పాల్గొన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో సతీష్ కడుపులో రెండు చోట్ల తీవ్ర గాయాలు అయ్యాయని తెలుస్తోంది.

రక్తపు మడుగులో ఉన్న గాయపడిన యువకుడిని వెంటనే నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితిపై స్పష్టమైన సమాచారం తెలియాల్సి ఉంది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News