PRINT TIME: April 30, 2026 11:44 PM
నల్గొండ జిల్లాలో కలకలం: గంజాయి మత్తులో యువకుడిపై కత్తి దాడి
నల్గొండ జిల్లాలో కలకలం: గంజాయి మత్తులో యువకుడిపై కత్తి దాడి
April 30, 2026 10:07 PM
70 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కాసనగోడు గ్రామంలో గంజాయి మత్తులో కత్తి దాడి ఘటన కలకలం రేపింది. మాచర్ల భరత్ అనే వ్యక్తి, గంజాయి ప్రభావంలో చెరుకు సతీష్ అనే యువకుడిపై కత్తితో దాడి చేసినట్లు సమాచారం.
స్థానికుల ప్రకారం, భరత్ గత కొంతకాలంగా మాదకద్రవ్యాల సరఫరా మరియు గంజాయి కేసుల్లో పాల్గొన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో సతీష్ కడుపులో రెండు చోట్ల తీవ్ర గాయాలు అయ్యాయని తెలుస్తోంది.
రక్తపు మడుగులో ఉన్న గాయపడిన యువకుడిని వెంటనే నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితిపై స్పష్టమైన సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి