నల్గొండ,: రాష్ట్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ డా. జి. చంద్రశేఖర్ రెడ్డి నల్గొండ పట్టణానికి విచ్చేసిన సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ ఛైర్మెన్ డా. బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా డా. కేశవులు మాట్లాడుతూ జిల్లాల్లో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. తమ సంస్థ ద్వారా ఆర్టీఐ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.
దీనికి ప్రతిగా రాష్ట్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ డా. జి. చంద్రశేఖర్ రెడ్డి, డా. కేశవులు ముదిరాజ్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో సందీప్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి