Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహనీయుల ఆశయాలు సాధించాలి – TSUTF అంబేడ్కర్: పుస్తకాలలో కాదు, ప్రస్తుత సమాజంలో పునర్జన్మ పొందాల్సిన ఆలోచన” హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 14, 2026 05:10 PM

మునిపంపులలో అంబేద్కర్ జయంతి వేడుకలు

మునిపంపులలో అంబేద్కర్ జయంతి వేడుకలు

మునిపంపులలో అంబేద్కర్ జయంతి వేడుకలు
April 14, 2026 01:22 PM 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మునిపంపుల తుమ్మబావి గూడెంలో దళిత రత్న వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో దళిత నాయకుడు అప్పం సురేందర్ మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా అనగారిన వర్గాలకు హక్కులు కల్పించి వారి అభ్యున్నతికి విశేష కృషి చేశారని అన్నారు. కులమత భేదాలు లేని సమాజ నిర్మాణమే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు.

అంబేద్కర్ దేశ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడని కొనియాడారు. యువత ఉన్నత విద్యను అభ్యసించి అస్పృశ్యత, కుల వివక్షలను నిర్మూలించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వార్డు నెంబర్ కట్ట అరుణ్ కుమార్, పావిరాల నరసింహ, బుంగ ప్రవీణ్, సాతీరు వెంకన్న, యాదయ్య, శీను, మురళి, విజయ, విజయ్, భాగ్యమ్మ, యాదమ్మతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News