Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవరకొండలో ఎక్సైజ్ దాడులు.. నాటుసారా గుట్టురట్టు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 01:49 PM

మునిపంపులలో అంబేద్కర్ జయంతి వేడుకలు

మునిపంపులలో అంబేద్కర్ జయంతి వేడుకలు

మునిపంపులలో అంబేద్కర్ జయంతి వేడుకలు
April 14, 2026 01:22 PM 69 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మునిపంపుల తుమ్మబావి గూడెంలో దళిత రత్న వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో దళిత నాయకుడు అప్పం సురేందర్ మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా అనగారిన వర్గాలకు హక్కులు కల్పించి వారి అభ్యున్నతికి విశేష కృషి చేశారని అన్నారు. కులమత భేదాలు లేని సమాజ నిర్మాణమే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు.

అంబేద్కర్ దేశ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడని కొనియాడారు. యువత ఉన్నత విద్యను అభ్యసించి అస్పృశ్యత, కుల వివక్షలను నిర్మూలించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వార్డు నెంబర్ కట్ట అరుణ్ కుమార్, పావిరాల నరసింహ, బుంగ ప్రవీణ్, సాతీరు వెంకన్న, యాదయ్య, శీను, మురళి, విజయ, విజయ్, భాగ్యమ్మ, యాదమ్మతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News