Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:41 PM

మునిపంపులలో అంబేద్కర్ జయంతి వేడుకలు

మునిపంపులలో అంబేద్కర్ జయంతి వేడుకలు

మునిపంపులలో అంబేద్కర్ జయంతి వేడుకలు
14-04-2026 73 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మునిపంపుల తుమ్మబావి గూడెంలో దళిత రత్న వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో దళిత నాయకుడు అప్పం సురేందర్ మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా అనగారిన వర్గాలకు హక్కులు కల్పించి వారి అభ్యున్నతికి విశేష కృషి చేశారని అన్నారు. కులమత భేదాలు లేని సమాజ నిర్మాణమే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు.

అంబేద్కర్ దేశ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడని కొనియాడారు. యువత ఉన్నత విద్యను అభ్యసించి అస్పృశ్యత, కుల వివక్షలను నిర్మూలించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వార్డు నెంబర్ కట్ట అరుణ్ కుమార్, పావిరాల నరసింహ, బుంగ ప్రవీణ్, సాతీరు వెంకన్న, యాదయ్య, శీను, మురళి, విజయ, విజయ్, భాగ్యమ్మ, యాదమ్మతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

మునిపంపులలో అంబేద్కర్ జయంతి వేడుకలు

Article Image

మునిపంపుల తుమ్మబావి గూడెంలో దళిత రత్న వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో దళిత నాయకుడు అప్పం సురేందర్ మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా అనగారిన వర్గాలకు హక్కులు కల్పించి వారి అభ్యున్నతికి విశేష కృషి చేశారని అన్నారు. కులమత భేదాలు లేని సమాజ నిర్మాణమే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు.

అంబేద్కర్ దేశ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడని కొనియాడారు. యువత ఉన్నత విద్యను అభ్యసించి అస్పృశ్యత, కుల వివక్షలను నిర్మూలించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వార్డు నెంబర్ కట్ట అరుణ్ కుమార్, పావిరాల నరసింహ, బుంగ ప్రవీణ్, సాతీరు వెంకన్న, యాదయ్య, శీను, మురళి, విజయ, విజయ్, భాగ్యమ్మ, యాదమ్మతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News