మునిపంపులలో అంబేద్కర్ జయంతి వేడుకలు
మునిపంపులలో అంబేద్కర్ జయంతి వేడుకలు
Editor Desk
మునిపంపుల తుమ్మబావి గూడెంలో దళిత రత్న వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో దళిత నాయకుడు అప్పం సురేందర్ మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా అనగారిన వర్గాలకు హక్కులు కల్పించి వారి అభ్యున్నతికి విశేష కృషి చేశారని అన్నారు. కులమత భేదాలు లేని సమాజ నిర్మాణమే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు.
అంబేద్కర్ దేశ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడని కొనియాడారు. యువత ఉన్నత విద్యను అభ్యసించి అస్పృశ్యత, కుల వివక్షలను నిర్మూలించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వార్డు నెంబర్ కట్ట అరుణ్ కుమార్, పావిరాల నరసింహ, బుంగ ప్రవీణ్, సాతీరు వెంకన్న, యాదయ్య, శీను, మురళి, విజయ, విజయ్, భాగ్యమ్మ, యాదమ్మతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి