Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:13 AM

మునిపంపుల తుమ్మబావి గూడెంలో సీఐటీయూ మే డే వేడుకలు

మునిపంపుల తుమ్మబావి గూడెంలో సీఐటీయూ మే డే వేడుకలు

మునిపంపుల తుమ్మబావి గూడెంలో సీఐటీయూ మే డే వేడుకలు
01-05-2026 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల తుమ్మబావి గూడెంలో సీఐటీయూ ఆధ్వర్యంలో 140వ మే డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు అప్పం సురేందర్ జెండా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు గతంలో రోజుకు 18 గంటలు పని చేసేవారని, “8 గంటల పని–8 గంటల విశ్రాంతి–8 గంటల వినోదం” హక్కుల కోసం తీవ్ర పోరాటాలు చేశారని గుర్తుచేశారు. చికాగోలో హేమార్కెట్ ఘటనలో కార్మికులు చేసిన త్యాగాల ఫలితంగా 8 గంటల పని దినం సాధ్యమైందన్నారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చే ప్రయత్నాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి పేదలకు సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో విజయరావు, ఇస్తారి, జయరాజ్, వెంకన్న, ప్రవీణ్, రాజు, అంబేద్కర్, నరసింహ, శివకుమార్, విజయ, సావిత్రి, మార్తమ్మ, సరోజ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మునిపంపుల తుమ్మబావి గూడెంలో సీఐటీయూ మే డే వేడుకలు

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల తుమ్మబావి గూడెంలో సీఐటీయూ ఆధ్వర్యంలో 140వ మే డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు అప్పం సురేందర్ జెండా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు గతంలో రోజుకు 18 గంటలు పని చేసేవారని, “8 గంటల పని–8 గంటల విశ్రాంతి–8 గంటల వినోదం” హక్కుల కోసం తీవ్ర పోరాటాలు చేశారని గుర్తుచేశారు. చికాగోలో హేమార్కెట్ ఘటనలో కార్మికులు చేసిన త్యాగాల ఫలితంగా 8 గంటల పని దినం సాధ్యమైందన్నారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చే ప్రయత్నాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి పేదలకు సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో విజయరావు, ఇస్తారి, జయరాజ్, వెంకన్న, ప్రవీణ్, రాజు, అంబేద్కర్, నరసింహ, శివకుమార్, విజయ, సావిత్రి, మార్తమ్మ, సరోజ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News