Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్నారుల భద్రతకు ముందడుగు – ప్రత్యేక బాల ఆరోగ్య పరీక్షలకు శ్రీకారం బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 01, 2026 09:18 PM

మునిపంపుల తుమ్మబావి గూడెంలో సీఐటీయూ మే డే వేడుకలు

మునిపంపుల తుమ్మబావి గూడెంలో సీఐటీయూ మే డే వేడుకలు

మునిపంపుల తుమ్మబావి గూడెంలో సీఐటీయూ మే డే వేడుకలు
May 01, 2026 07:04 PM 8 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల తుమ్మబావి గూడెంలో సీఐటీయూ ఆధ్వర్యంలో 140వ మే డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు అప్పం సురేందర్ జెండా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు గతంలో రోజుకు 18 గంటలు పని చేసేవారని, “8 గంటల పని–8 గంటల విశ్రాంతి–8 గంటల వినోదం” హక్కుల కోసం తీవ్ర పోరాటాలు చేశారని గుర్తుచేశారు. చికాగోలో హేమార్కెట్ ఘటనలో కార్మికులు చేసిన త్యాగాల ఫలితంగా 8 గంటల పని దినం సాధ్యమైందన్నారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చే ప్రయత్నాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి పేదలకు సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో విజయరావు, ఇస్తారి, జయరాజ్, వెంకన్న, ప్రవీణ్, రాజు, అంబేద్కర్, నరసింహ, శివకుమార్, విజయ, సావిత్రి, మార్తమ్మ, సరోజ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News