మునిపంపుల తుమ్మబావి గూడెంలో సీఐటీయూ మే డే వేడుకలు
మునిపంపుల తుమ్మబావి గూడెంలో సీఐటీయూ మే డే వేడుకలు
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల తుమ్మబావి గూడెంలో సీఐటీయూ ఆధ్వర్యంలో 140వ మే డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు అప్పం సురేందర్ జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు గతంలో రోజుకు 18 గంటలు పని చేసేవారని, “8 గంటల పని–8 గంటల విశ్రాంతి–8 గంటల వినోదం” హక్కుల కోసం తీవ్ర పోరాటాలు చేశారని గుర్తుచేశారు. చికాగోలో హేమార్కెట్ ఘటనలో కార్మికులు చేసిన త్యాగాల ఫలితంగా 8 గంటల పని దినం సాధ్యమైందన్నారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చే ప్రయత్నాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి పేదలకు సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో విజయరావు, ఇస్తారి, జయరాజ్, వెంకన్న, ప్రవీణ్, రాజు, అంబేద్కర్, నరసింహ, శివకుమార్, విజయ, సావిత్రి, మార్తమ్మ, సరోజ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి