Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హరీష్ రావును కలిసిన ఉద్యమ నేత ఎస్.కె. చాంద్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 07, 2026 11:29 PM

మూడు కార్పొరేషన్లకు ప్రత్యేక చట్టం.. కోర్ అర్బన్ చట్టం రూపకల్పనకు ఆదేశం

మూడు కార్పొరేషన్లకు ప్రత్యేక చట్టం.. కోర్ అర్బన్ చట్టం రూపకల్పనకు ఆదేశం

మూడు కార్పొరేషన్లకు ప్రత్యేక చట్టం.. కోర్ అర్బన్ చట్టం రూపకల్పనకు ఆదేశం
February 28, 2026 12:33 PM 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రేవంత్ రెడ్డి ఆదేశాలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం స్థానంలో కొత్త విధానం

రాష్ట్రంలోని మూడు ప్రధాన నగర కార్పొరేషన్లకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం స్థానంలో మూడు కార్పొరేషన్లకు సమానంగా వర్తించేలా “కోర్ అర్బన్ చట్టం”ను తయారు చేయాలని సూచించారు.హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల పరిధిలో అభివృద్ధి పనులు, పన్నుల వసూళ్లు, అనుమతులు, ఇతర పరిపాలనా కార్యక్రమాలకు ఈ కొత్త చట్టం ఆధారంగా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.కోర్ అర్బన్ ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నగరాల్లో వీధిదీపాల వ్యవస్థను సమగ్ర పర్యవేక్షణ వ్యవస్థతో అనుసంధానం చేయాలని సూచించారు. వీధిదీపాల పనితీరును ఎప్పటికప్పుడు గమనించే విధంగా కేంద్ర నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని తెలిపారు.పట్టణ పరిపాలనలో పారదర్శకత, వేగం, సమన్వయం పెంచడమే కోర్ అర్బన్ చట్టం లక్ష్యమని అధికారులు వెల్లడించారు. త్వరలోనే చట్ట ముసాయిదాను సిద్ధం చేసి మంత్రివర్గ ఆమోదానికి తీసుకురానున్నట్లు సమాచారం.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News