Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:09 PM

మూడు కార్పొరేషన్లకు ప్రత్యేక చట్టం.. కోర్ అర్బన్ చట్టం రూపకల్పనకు ఆదేశం

మూడు కార్పొరేషన్లకు ప్రత్యేక చట్టం.. కోర్ అర్బన్ చట్టం రూపకల్పనకు ఆదేశం

మూడు కార్పొరేషన్లకు ప్రత్యేక చట్టం.. కోర్ అర్బన్ చట్టం రూపకల్పనకు ఆదేశం
28-02-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రేవంత్ రెడ్డి ఆదేశాలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం స్థానంలో కొత్త విధానం

రాష్ట్రంలోని మూడు ప్రధాన నగర కార్పొరేషన్లకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం స్థానంలో మూడు కార్పొరేషన్లకు సమానంగా వర్తించేలా “కోర్ అర్బన్ చట్టం”ను తయారు చేయాలని సూచించారు.హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల పరిధిలో అభివృద్ధి పనులు, పన్నుల వసూళ్లు, అనుమతులు, ఇతర పరిపాలనా కార్యక్రమాలకు ఈ కొత్త చట్టం ఆధారంగా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.కోర్ అర్బన్ ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నగరాల్లో వీధిదీపాల వ్యవస్థను సమగ్ర పర్యవేక్షణ వ్యవస్థతో అనుసంధానం చేయాలని సూచించారు. వీధిదీపాల పనితీరును ఎప్పటికప్పుడు గమనించే విధంగా కేంద్ర నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని తెలిపారు.పట్టణ పరిపాలనలో పారదర్శకత, వేగం, సమన్వయం పెంచడమే కోర్ అర్బన్ చట్టం లక్ష్యమని అధికారులు వెల్లడించారు. త్వరలోనే చట్ట ముసాయిదాను సిద్ధం చేసి మంత్రివర్గ ఆమోదానికి తీసుకురానున్నట్లు సమాచారం.

Sthanikam

మూడు కార్పొరేషన్లకు ప్రత్యేక చట్టం.. కోర్ అర్బన్ చట్టం రూపకల్పనకు ఆదేశం

Article Image

రేవంత్ రెడ్డి ఆదేశాలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం స్థానంలో కొత్త విధానం

రాష్ట్రంలోని మూడు ప్రధాన నగర కార్పొరేషన్లకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం స్థానంలో మూడు కార్పొరేషన్లకు సమానంగా వర్తించేలా “కోర్ అర్బన్ చట్టం”ను తయారు చేయాలని సూచించారు.హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల పరిధిలో అభివృద్ధి పనులు, పన్నుల వసూళ్లు, అనుమతులు, ఇతర పరిపాలనా కార్యక్రమాలకు ఈ కొత్త చట్టం ఆధారంగా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.కోర్ అర్బన్ ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నగరాల్లో వీధిదీపాల వ్యవస్థను సమగ్ర పర్యవేక్షణ వ్యవస్థతో అనుసంధానం చేయాలని సూచించారు. వీధిదీపాల పనితీరును ఎప్పటికప్పుడు గమనించే విధంగా కేంద్ర నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని తెలిపారు.పట్టణ పరిపాలనలో పారదర్శకత, వేగం, సమన్వయం పెంచడమే కోర్ అర్బన్ చట్టం లక్ష్యమని అధికారులు వెల్లడించారు. త్వరలోనే చట్ట ముసాయిదాను సిద్ధం చేసి మంత్రివర్గ ఆమోదానికి తీసుకురానున్నట్లు సమాచారం.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News