యాదాద్రి జిల్లా: ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఓ చెరువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సర్వే నంబర్ 430లో 98 ఎకరాల 14 గుంటల విస్తీర్ణంతో, సుమారు 20 అడుగుల లోతుతో ఉన్న ఈ చెరువులో గత సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది నీటిమట్టం గణనీయంగా పెరిగిందని స్థానికులు తెలిపారు.
మోత్కూరు–తిరుమలగిరి ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో ఈ చెరువు అందంగా కనిపిస్తూ, పట్టణవాసులు దీనిని ముద్దుగా “మినీ ట్యాంక్ బండ్”గా పిలుస్తున్నారు. చెరువు నిండుకుండలా కళకళలాడుతూ ఉండటంతో పరిసర ప్రాంతాలకు శోభను తీసుకొస్తోంది.
ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నీటి సంరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలని, ఇలాంటి నీటి వనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు సూచిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి