మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో రంజాన్ పండుగ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం నుంచే ముస్లిం సోదరులు పట్టణంలోని ఈద్గా వద్దకు భారీగా తరలివచ్చి సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.
చిన్నలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఒకేచోట చేరి భక్తిశ్రద్ధలతో నమాజ్ చేశారు. ప్రార్థనల అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుని పండుగను ఆనందంగా జరుపుకున్నారు.
ఏటా ఆనవాయితీగా మోత్కూరులో రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని, ఈ సందర్భంగా సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం మరింత బలపడుతుందని ముస్లిం సోదరులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి