మంత్రి సవిత పర్యటన – పెనుకొండలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
మంత్రి సవిత పర్యటన – పెనుకొండలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
EDIGA NAVEENKUMAR
పెనుకొండ నియోజకవర్గం
మే 1, 2026
రాష్ట్ర మంత్రి సవిత రేపు పెనుకొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు ప్రజా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఉదయం రొద్దం మండలం రాచూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంతో ఆమె పర్యటన ప్రారంభమవుతుంది. అనంతరం జక్కల చెరువు, కుర్లపల్లి, నారానాగేపల్లి ప్రాంతాల్లో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్లను ప్రారంభించనున్నారు. ఈ రహదారులు గ్రామీణ ప్రాంతాల రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తాయని అధికారులు భావిస్తున్నారు.
మధ్యాహ్నం నారానాగేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ (HDS) అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, వైద్య సేవల మెరుగుదలపై చర్చించనున్నారు.
ఈ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని మంత్రి కార్యాలయం పిలుపునిచ్చింది. అలాగే మీడియా ప్రతినిధులు కార్యక్రమాలను కవర్ చేయాలని కోరింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి