Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లింగమంతులు–సౌడలమ్మ జాతరలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దైద రవీందర్ డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 05, 2026 02:43 PM

మండుటెండలో రహదారిపై రైతుల రాస్తారోకో..ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్

మండుటెండలో రహదారిపై రైతుల రాస్తారోకో..ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్

మండుటెండలో రహదారిపై రైతుల రాస్తారోకో..ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్
May 05, 2026 01:01 PM 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మార్కెట్‌కు తీసుకువచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ కక్కిరేణి గ్రామ రైతులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట చిట్యాల–భువనగిరి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

నెలరోజులుగా ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో ధాన్యం తడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

హామాలీలు, లారీలు, కాంటాలను పెంచి త్వరితగతిన కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

రైస్ మిల్లుల దోపిడీని అరికట్టాలని, ఐదు నుంచి ఆరు కిలోల వరకు కటింగ్ చేస్తున్న మిల్లులను తక్షణమే సీజ్ చేయాలని కోరారు.

రాస్తారోకో అరగంటకు పైగా కొనసాగింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ కార్యక్రమంలో పల్లగొర్ల రామ్ దేవ్, పిట్ట కృష్ణారెడ్డి, ముద్రబోయిన శ్రీశైలం, గుండాల మల్లేశ్, బుర్ర సైదులు, ఆదినారాయణ, చలపతిరెడ్డి, మారయ్య, నర్సింహ, శేఖర్, సరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News