మండుటెండలో రహదారిపై రైతుల రాస్తారోకో..ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్
మండుటెండలో రహదారిపై రైతుల రాస్తారోకో..ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్
Editor Desk
మార్కెట్కు తీసుకువచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ కక్కిరేణి గ్రామ రైతులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట చిట్యాల–భువనగిరి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
నెలరోజులుగా ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో ధాన్యం తడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
హామాలీలు, లారీలు, కాంటాలను పెంచి త్వరితగతిన కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
రైస్ మిల్లుల దోపిడీని అరికట్టాలని, ఐదు నుంచి ఆరు కిలోల వరకు కటింగ్ చేస్తున్న మిల్లులను తక్షణమే సీజ్ చేయాలని కోరారు.
రాస్తారోకో అరగంటకు పైగా కొనసాగింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ కార్యక్రమంలో పల్లగొర్ల రామ్ దేవ్, పిట్ట కృష్ణారెడ్డి, ముద్రబోయిన శ్రీశైలం, గుండాల మల్లేశ్, బుర్ర సైదులు, ఆదినారాయణ, చలపతిరెడ్డి, మారయ్య, నర్సింహ, శేఖర్, సరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి