మండలంలో మెరిసిన గర్ల్స్ హై స్కూల్ బోడ సాత్వికకు 553 మార్కులతో టాప్ స్థానం
మండలంలో మెరిసిన గర్ల్స్ హై స్కూల్ బోడ సాత్వికకు 553 మార్కులతో టాప్ స్థానం
Editor Desk
రామన్నపేట:
పదవ తరగతి ఫలితాల్లో రామన్నపేట మండలంలో గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. మండల స్థాయిలో బాలికలు మొదటి స్థానంలో నిలవడం విశేషం కాగా, బాలురు ద్వితీయ స్థానంలో నిలిచారు. ప్రభుత్వ పాఠశాలైన గర్ల్స్ హై స్కూల్ ఈ ఫలితాలు సాధించడం పట్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
టాపర్స్ వివరాలు:
బోడ సాత్విక – 553 మార్కులు
బండ ఉమామహేశ్వరి – 543 మార్కులు
భూతం రాధిక – 539 మార్కులు
ఈ సందర్భంగా క్లాస్ టీచర్ సృజనకుమారి విద్యార్థులను అభినందించారు. ఎంఈఓ గవ్వ జ్యోతి మాట్లాడుతూ, పాఠశాల ఉపాధ్యాయులు క్రమశిక్షణతో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడంతో పాటు ‘వందేమాతరం’, ‘సుమధుర ఫౌండేషన్’ సహకారంతో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలూ సరైన మార్గదర్శకత్వం, కృషితో మెరుగైన ఫలితాలు సాధించగలవని ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయని ఆమె పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి