Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:14 AM

మండలంలో మెరిసిన గర్ల్స్ హై స్కూల్ బోడ సాత్వికకు 553 మార్కులతో టాప్ స్థానం

మండలంలో మెరిసిన గర్ల్స్ హై స్కూల్ బోడ సాత్వికకు 553 మార్కులతో టాప్ స్థానం

మండలంలో మెరిసిన గర్ల్స్ హై స్కూల్ బోడ సాత్వికకు 553 మార్కులతో టాప్ స్థానం
29-04-2026 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట:

పదవ తరగతి ఫలితాల్లో రామన్నపేట మండలంలో గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. మండల స్థాయిలో బాలికలు మొదటి స్థానంలో నిలవడం విశేషం కాగా, బాలురు ద్వితీయ స్థానంలో నిలిచారు. ప్రభుత్వ పాఠశాలైన గర్ల్స్ హై స్కూల్ ఈ ఫలితాలు సాధించడం పట్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

టాపర్స్ వివరాలు:

బోడ సాత్విక – 553 మార్కులు

బండ ఉమామహేశ్వరి – 543 మార్కులు

భూతం రాధిక – 539 మార్కులు

ఈ సందర్భంగా క్లాస్ టీచర్ సృజనకుమారి విద్యార్థులను అభినందించారు. ఎంఈఓ గవ్వ జ్యోతి మాట్లాడుతూ, పాఠశాల ఉపాధ్యాయులు క్రమశిక్షణతో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడంతో పాటు ‘వందేమాతరం’, ‘సుమధుర ఫౌండేషన్’ సహకారంతో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలూ సరైన మార్గదర్శకత్వం, కృషితో మెరుగైన ఫలితాలు సాధించగలవని ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయని ఆమె పేర్కొన్నారు.

Sthanikam

మండలంలో మెరిసిన గర్ల్స్ హై స్కూల్ బోడ సాత్వికకు 553 మార్కులతో టాప్ స్థానం

Article Image

రామన్నపేట:

పదవ తరగతి ఫలితాల్లో రామన్నపేట మండలంలో గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. మండల స్థాయిలో బాలికలు మొదటి స్థానంలో నిలవడం విశేషం కాగా, బాలురు ద్వితీయ స్థానంలో నిలిచారు. ప్రభుత్వ పాఠశాలైన గర్ల్స్ హై స్కూల్ ఈ ఫలితాలు సాధించడం పట్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

టాపర్స్ వివరాలు:

బోడ సాత్విక – 553 మార్కులు

బండ ఉమామహేశ్వరి – 543 మార్కులు

భూతం రాధిక – 539 మార్కులు

ఈ సందర్భంగా క్లాస్ టీచర్ సృజనకుమారి విద్యార్థులను అభినందించారు. ఎంఈఓ గవ్వ జ్యోతి మాట్లాడుతూ, పాఠశాల ఉపాధ్యాయులు క్రమశిక్షణతో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడంతో పాటు ‘వందేమాతరం’, ‘సుమధుర ఫౌండేషన్’ సహకారంతో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలూ సరైన మార్గదర్శకత్వం, కృషితో మెరుగైన ఫలితాలు సాధించగలవని ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయని ఆమె పేర్కొన్నారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News