మేలైన వంగడాలతోనే అధిక దిగుబడులు
మేలైన వంగడాలతోనే అధిక దిగుబడులు
K.RAVI
కుంట్లగూడెంలో మహేంద్ర సీడ్స్ అవగాహన సదస్సు
సాగులో రాణిస్తున్న ఎంపీ 3033, కిరణ్ రకాలు
రైతులు ఎప్పటికప్పుడు నూతన వంగడాలపై అవగాహన పెంచుకున్నప్పుడే వ్యవసాయంలో లాభాలు గడించవచ్చని మహేంద్ర సీడ్స్ కంపెనీ ప్రతినిధులు సూచించారు. బుధవారం చౌటుప్పల్ మండలం కుంట్లగూడెం గ్రామంలో కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఎకరాకు 40 క్వింటాల దిగుబడిపై ధీమా..
గ్రామానికి చెందిన రైతు చప్పిడి సత్తిరెడ్డి తన 10 ఎకరాల పొలంలో మహేంద్ర సీడ్స్ కు చెందిన ఎంపీ 3033, కిరణ్ రకాలను సాగు చేశారు. క్షేత్రస్థాయిలో పంటను పరిశీలించిన ప్రతినిధులు.. ఒక్కో కంకికి సుమారు 350 నుండి 400 గింజలు ఉన్నాయని, ఎకరాకు 35 నుండి 40 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఆశించిన స్థాయిలో పంట సాగు చేసిన రైతు సత్తిరెడ్డిని సీనియర్ టెరిటరీ మేనేజర్ బుర్ర అనిల్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో అగ్రోస్ రైతు సేవా కేంద్రం డీలర్ కొయ్యారే సైదులు, రైతులు రఘునాథరెడ్డి, నర్సిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వంద మంది రైతులు పాల్గొన్నారు. కంపెనీ ప్రతినిధులు రైతులకు విత్తన యాజమాన్య పద్ధతులపై పలు సూచనలు చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి