Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:02 AM

మేలైన వంగడాలతోనే అధిక దిగుబడులు

మేలైన వంగడాలతోనే అధిక దిగుబడులు

మేలైన వంగడాలతోనే అధిక దిగుబడులు
15-04-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కుంట్లగూడెంలో మహేంద్ర సీడ్స్ అవగాహన సదస్సు

సాగులో రాణిస్తున్న ఎంపీ 3033, కిరణ్ రకాలు

రైతులు ఎప్పటికప్పుడు నూతన వంగడాలపై అవగాహన పెంచుకున్నప్పుడే వ్యవసాయంలో లాభాలు గడించవచ్చని మహేంద్ర సీడ్స్ కంపెనీ ప్రతినిధులు సూచించారు. బుధవారం చౌటుప్పల్ మండలం కుంట్లగూడెం గ్రామంలో కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.


ఎకరాకు 40 క్వింటాల దిగుబడిపై ధీమా..


గ్రామానికి చెందిన రైతు చప్పిడి సత్తిరెడ్డి తన 10 ఎకరాల పొలంలో మహేంద్ర సీడ్స్ కు చెందిన ఎంపీ 3033, కిరణ్ రకాలను సాగు చేశారు. క్షేత్రస్థాయిలో పంటను పరిశీలించిన ప్రతినిధులు.. ఒక్కో కంకికి సుమారు 350 నుండి 400 గింజలు ఉన్నాయని, ఎకరాకు 35 నుండి 40 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఆశించిన స్థాయిలో పంట సాగు చేసిన రైతు సత్తిరెడ్డిని సీనియర్ టెరిటరీ మేనేజర్ బుర్ర అనిల్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో అగ్రోస్ రైతు సేవా కేంద్రం డీలర్ కొయ్యారే సైదులు, రైతులు రఘునాథరెడ్డి, నర్సిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వంద మంది రైతులు పాల్గొన్నారు. కంపెనీ ప్రతినిధులు రైతులకు విత్తన యాజమాన్య పద్ధతులపై పలు సూచనలు చేశారు.

Sthanikam

మేలైన వంగడాలతోనే అధిక దిగుబడులు

Article Image

కుంట్లగూడెంలో మహేంద్ర సీడ్స్ అవగాహన సదస్సు

సాగులో రాణిస్తున్న ఎంపీ 3033, కిరణ్ రకాలు

రైతులు ఎప్పటికప్పుడు నూతన వంగడాలపై అవగాహన పెంచుకున్నప్పుడే వ్యవసాయంలో లాభాలు గడించవచ్చని మహేంద్ర సీడ్స్ కంపెనీ ప్రతినిధులు సూచించారు. బుధవారం చౌటుప్పల్ మండలం కుంట్లగూడెం గ్రామంలో కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.


ఎకరాకు 40 క్వింటాల దిగుబడిపై ధీమా..


గ్రామానికి చెందిన రైతు చప్పిడి సత్తిరెడ్డి తన 10 ఎకరాల పొలంలో మహేంద్ర సీడ్స్ కు చెందిన ఎంపీ 3033, కిరణ్ రకాలను సాగు చేశారు. క్షేత్రస్థాయిలో పంటను పరిశీలించిన ప్రతినిధులు.. ఒక్కో కంకికి సుమారు 350 నుండి 400 గింజలు ఉన్నాయని, ఎకరాకు 35 నుండి 40 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఆశించిన స్థాయిలో పంట సాగు చేసిన రైతు సత్తిరెడ్డిని సీనియర్ టెరిటరీ మేనేజర్ బుర్ర అనిల్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో అగ్రోస్ రైతు సేవా కేంద్రం డీలర్ కొయ్యారే సైదులు, రైతులు రఘునాథరెడ్డి, నర్సిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వంద మంది రైతులు పాల్గొన్నారు. కంపెనీ ప్రతినిధులు రైతులకు విత్తన యాజమాన్య పద్ధతులపై పలు సూచనలు చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News