పదవీకాలం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్గా కొనసాగుతున్న శ్రీనివాస్ రెడ్డి పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన సేవలను మరింత కాలం వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మీడియా రంగ అభివృద్ధి, పాత్రికేయుల సంక్షేమ కార్యక్రమాల అమలులో శ్రీనివాస్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు దృష్ట్యా ప్రభుత్వం పదవీకాలాన్ని పొడిగించినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో మీడియా వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి