మేడే వేడుకల్లో రాజకీయ వేడి. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ: సురేష్కుమార్
మేడే వేడుకల్లో రాజకీయ వేడి. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ: సురేష్కుమార్
Editor Desk
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం–327 కంపెనీ అధ్యక్షుడు ఎం.సురేష్కుమార్ విమర్శించారు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని విద్యుత్ కార్యాలయంలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఆయన మాట్లాడారు.
కార్మికుల పని గంటలను 8 గంటల నుంచి 12 గంటలకు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు పలు చట్టాలు తీసుకొచ్చామని తెలిపారు.
మాజీ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని, ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
నకిరేకల్ నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నామని, సాగునీరు, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి సమ్మిరెడ్డి, ఐఎన్టీయూసీ నాయకులు సురేష్బాబు, వెంకన్న, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, గుండాల సీనయ్య, నాగరాజు, అనిల్, వెంకటరమణ, భిక్షం, నరసింహ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ ఉద్యోగులు, కార్మికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి