Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:11 AM

మేడే అమరుల స్ఫూర్తితో పోరాడాలి.

మేడే అమరుల స్ఫూర్తితో పోరాడాలి.

మేడే అమరుల స్ఫూర్తితో పోరాడాలి.
01-05-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

చికాగో అమరుల స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక విధానాలపై సంఘటితంగా పోరాడాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. మే డే సందర్భంగా రామన్నపేట మండలంలో సిపిఎం ఆధ్వర్యంలో గ్రామాల వారీగా జెండా ఆవిష్కరణలు, ర్యాలీలు నిర్వహించి ఉత్సాహంగా మేడే వేడుకలు జరిపారు.

ఈ సందర్భంగా మండల కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం గతంలో జరిగిన పోరాటాలను గుర్తుచేశారు. కార్మికులు లేనిదే దేశ ప్రగతి సాధ్యం కాదని, పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న లేబర్ కోడ్లపై విమర్శలు వ్యక్తం చేస్తూ కార్మిక హక్కులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోరాటాల ద్వారానే కార్మికులకు న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటీ సభ్యులు ఉపేందర్, అంజయ్య, సిఐటియు నాయకులు, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

మేడే అమరుల స్ఫూర్తితో పోరాడాలి.

Article Image

రామన్నపేట

చికాగో అమరుల స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక విధానాలపై సంఘటితంగా పోరాడాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. మే డే సందర్భంగా రామన్నపేట మండలంలో సిపిఎం ఆధ్వర్యంలో గ్రామాల వారీగా జెండా ఆవిష్కరణలు, ర్యాలీలు నిర్వహించి ఉత్సాహంగా మేడే వేడుకలు జరిపారు.

ఈ సందర్భంగా మండల కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం గతంలో జరిగిన పోరాటాలను గుర్తుచేశారు. కార్మికులు లేనిదే దేశ ప్రగతి సాధ్యం కాదని, పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న లేబర్ కోడ్లపై విమర్శలు వ్యక్తం చేస్తూ కార్మిక హక్కులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోరాటాల ద్వారానే కార్మికులకు న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటీ సభ్యులు ఉపేందర్, అంజయ్య, సిఐటియు నాయకులు, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News