మేడే అమరుల స్ఫూర్తితో పోరాడాలి.
మేడే అమరుల స్ఫూర్తితో పోరాడాలి.
Editor Desk
రామన్నపేట
చికాగో అమరుల స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక విధానాలపై సంఘటితంగా పోరాడాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. మే డే సందర్భంగా రామన్నపేట మండలంలో సిపిఎం ఆధ్వర్యంలో గ్రామాల వారీగా జెండా ఆవిష్కరణలు, ర్యాలీలు నిర్వహించి ఉత్సాహంగా మేడే వేడుకలు జరిపారు.
ఈ సందర్భంగా మండల కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం గతంలో జరిగిన పోరాటాలను గుర్తుచేశారు. కార్మికులు లేనిదే దేశ ప్రగతి సాధ్యం కాదని, పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న లేబర్ కోడ్లపై విమర్శలు వ్యక్తం చేస్తూ కార్మిక హక్కులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోరాటాల ద్వారానే కార్మికులకు న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటీ సభ్యులు ఉపేందర్, అంజయ్య, సిఐటియు నాయకులు, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి