Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్నారుల భద్రతకు ముందడుగు – ప్రత్యేక బాల ఆరోగ్య పరీక్షలకు శ్రీకారం బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 01, 2026 09:09 PM

మేడే అమరుల స్ఫూర్తితో పోరాడాలి.

మేడే అమరుల స్ఫూర్తితో పోరాడాలి.

మేడే అమరుల స్ఫూర్తితో పోరాడాలి.
May 01, 2026 07:09 PM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

చికాగో అమరుల స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక విధానాలపై సంఘటితంగా పోరాడాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. మే డే సందర్భంగా రామన్నపేట మండలంలో సిపిఎం ఆధ్వర్యంలో గ్రామాల వారీగా జెండా ఆవిష్కరణలు, ర్యాలీలు నిర్వహించి ఉత్సాహంగా మేడే వేడుకలు జరిపారు.

ఈ సందర్భంగా మండల కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం గతంలో జరిగిన పోరాటాలను గుర్తుచేశారు. కార్మికులు లేనిదే దేశ ప్రగతి సాధ్యం కాదని, పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న లేబర్ కోడ్లపై విమర్శలు వ్యక్తం చేస్తూ కార్మిక హక్కులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోరాటాల ద్వారానే కార్మికులకు న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటీ సభ్యులు ఉపేందర్, అంజయ్య, సిఐటియు నాయకులు, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News