Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:09 AM

మే డే స్ఫూర్తితో కార్మిక వర్గం ఐక్యం కావాలి దాసరి పాండు

మే డే స్ఫూర్తితో కార్మిక వర్గం ఐక్యం కావాలి దాసరి పాండు

మే డే స్ఫూర్తితో కార్మిక వర్గం ఐక్యం కావాలి దాసరి పాండు
28-04-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,: మే డే స్ఫూర్తితో కార్మిక వర్గం ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు దాసరి పాండు పిలుపునిచ్చారు.

మంగళవారం భువనగిరిలోని సీఐటీయూ కార్యాలయంలో మండల గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశం బొల్లేపల్లి స్వామి అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ… అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న మే డే దినోత్సవాన్ని కార్మిక వర్గం పండుగలా జరుపుకోవాలని అన్నారు. పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా చికాగో అమరవీరుల పోరాట స్ఫూర్తితో మే డేను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు స్వామి, శంకర్, ఐలయ్య, రామచందర్, నరసమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మే డే స్ఫూర్తితో కార్మిక వర్గం ఐక్యం కావాలి దాసరి పాండు

Article Image

భువనగిరి,: మే డే స్ఫూర్తితో కార్మిక వర్గం ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు దాసరి పాండు పిలుపునిచ్చారు.

మంగళవారం భువనగిరిలోని సీఐటీయూ కార్యాలయంలో మండల గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశం బొల్లేపల్లి స్వామి అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ… అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న మే డే దినోత్సవాన్ని కార్మిక వర్గం పండుగలా జరుపుకోవాలని అన్నారు. పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా చికాగో అమరవీరుల పోరాట స్ఫూర్తితో మే డేను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు స్వామి, శంకర్, ఐలయ్య, రామచందర్, నరసమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News