Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ పార్టీకి సేవాదళ్ వెన్నెముక లాంటిది : నిర్మలా జగ్గారెడ్డి రొద్దంలో వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభం రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఎస్సై చైతన్య చందర్ పై వేటు పడింది వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 28, 2026 08:11 PM

మే డే స్ఫూర్తితో కార్మిక వర్గం ఐక్యం కావాలి దాసరి పాండు

మే డే స్ఫూర్తితో కార్మిక వర్గం ఐక్యం కావాలి దాసరి పాండు

మే డే స్ఫూర్తితో కార్మిక వర్గం ఐక్యం కావాలి దాసరి పాండు
April 28, 2026 05:36 PM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,: మే డే స్ఫూర్తితో కార్మిక వర్గం ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు దాసరి పాండు పిలుపునిచ్చారు.

మంగళవారం భువనగిరిలోని సీఐటీయూ కార్యాలయంలో మండల గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశం బొల్లేపల్లి స్వామి అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ… అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న మే డే దినోత్సవాన్ని కార్మిక వర్గం పండుగలా జరుపుకోవాలని అన్నారు. పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా చికాగో అమరవీరుల పోరాట స్ఫూర్తితో మే డేను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు స్వామి, శంకర్, ఐలయ్య, రామచందర్, నరసమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News