మే డే స్ఫూర్తితో కార్మిక వర్గం ఐక్యం కావాలి దాసరి పాండు
మే డే స్ఫూర్తితో కార్మిక వర్గం ఐక్యం కావాలి దాసరి పాండు
Editor Desk
భువనగిరి,: మే డే స్ఫూర్తితో కార్మిక వర్గం ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు దాసరి పాండు పిలుపునిచ్చారు.
మంగళవారం భువనగిరిలోని సీఐటీయూ కార్యాలయంలో మండల గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశం బొల్లేపల్లి స్వామి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ… అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న మే డే దినోత్సవాన్ని కార్మిక వర్గం పండుగలా జరుపుకోవాలని అన్నారు. పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా చికాగో అమరవీరుల పోరాట స్ఫూర్తితో మే డేను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు స్వామి, శంకర్, ఐలయ్య, రామచందర్, నరసమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి