Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్నారులకు ఆశీర్వాదం అందించిన దైద రవీందర్ సన్‌రైజర్స్‌పై ఆర్సీబీ ఘన విజయం.. ఉప్పెనలా చెలరేగిన కోహ్లీ, పడిక్కల్! అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ పుస్తకాల కోసం ఇల్లు కట్టిన విశ్వ రత్న: డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అక్షర యాత్ర “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” 6లోగా అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు శ్రీరామ నవమి సందర్భంగా సుద్దకుంటపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ఊరేగింపు ఘనంగా “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 29, 2026 03:36 PM

ముత్యాలమ్మగూడెంలో ఉచిత 'ఈఎన్‌టీ' వైద్య శిబిరం..

ముత్యాలమ్మగూడెంలో ఉచిత 'ఈఎన్‌టీ' వైద్య శిబిరం..

ముత్యాలమ్మగూడెంలో ఉచిత 'ఈఎన్‌టీ' వైద్య శిబిరం..
March 29, 2026 01:11 PM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

పేదలకు నాణ్యమైన వైద్యం అందడం అభినందనీయం...సర్పంచ్ సంధ్య వెంకన్న

డాక్టర్ చెవుల శ్వేత ఆధ్వర్యంలో 150 మందికి పరీక్షలు..


​కట్టంగూర్ : గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెంలో నిర్వహించిన ఉచిత చెవి-ముక్కు-గొంతు (ఈఎన్‌టీ) వైద్య శిబిరం ఆదివారం విజయవంతమైంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రముఖ చిన్మయి ఆస్పత్రికి చెందిన నిపుణులు డాక్టర్ చెవుల శ్వేత ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సుంకరబోయిన సంధ్య వెంకన్న ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ నగరాలకు వెళ్లి ఖరీదైన వైద్యం చేయించుకోలేని పేద ప్రజల కోసం డాక్టర్ శ్వేత స్వయంగా గ్రామానికి వచ్చి ఈ శిబిరాన్ని నిర్వహించడం ఎంతో సంతోషకరమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని ముఖ్యంగా ముక్కు మరియు గొంతు సంబంధిత సమస్యలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని ఆమె గ్రామస్తులకు సూచించారు.ఈ శిబిరంలో భాగంగా డాక్టర్ శ్వేత ఆధునిక పరికరాలతో సుమారు 150 మందికి పైగా గ్రామస్తులు, విద్యార్థులు మరియు పంచాయతీ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాధితులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వచ్చే అలర్జీలు వినికిడి లోపాలు మరియు గొంతు ఇన్ఫెక్షన్ల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ శ్వేత స్వయంగా రోగులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాయప్ప, గ్రామ పెద్దలు మేకల శంకర్, బంటు రాంబాబు, అలెగ్జాండర్, మొర్సు వెంకన్న, కృష్ణయ్య, అంగన్వాడీ టీచర్ కళమ్మ, తరాల పరమేశ్ యాదవ్, గాలి సంధ్యారాణి, నాగార్జున, చైతన్య మరియు చిన్మయి ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News