PRINT TIME: March 23, 2026 11:10 PM
మాట నిలబెట్టుకున్న సర్పంచ్
మాట నిలబెట్టుకున్న సర్పంచ్
March 23, 2026 09:05 PM
3 Views
స్థానికం ప్రతినిధి :
Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy
న్యాల్కల్,
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని డప్పూర్ గ్రామ సర్పంచ్ జగదాంబ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.రంజాన్ పర్వదినాన్నిపురస్కరించుకుని స్థానిక మసీదు కమిటీకి ఆదివారం రూ.11,000 నగదును అందజేశారు. ఎన్నికల సమయంలో తాను సర్పంచ్గా గెలిస్తే విజయదశమి, క్రిస్మస్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి, రంజాన్ వంటి పండుగలకు ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు.
ఈ మేరకు ఇప్పటికే క్రిస్మస్ సందర్భంగా ఆర్థిక సహాయం అందించిన జగదాంబ, తాజాగా రంజాన్ పండుగకు కూడా రూ.11,000 అందజేసి తన మాట నిలబెట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ గౌడ్, స్థానికులు అన్నయ్యప్ప, రాజు, కాజా మియా, జమీర్, రామ్ రెడ్డి, బాబు, ఇసాక్, ఇస్మాయిల్త దితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి