Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 10:11 PM

మాట నిలబెట్టుకున్న సర్పంచ్

మాట నిలబెట్టుకున్న సర్పంచ్

మాట నిలబెట్టుకున్న సర్పంచ్
March 23, 2026 09:05 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్,

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని డప్పూర్ గ్రామ సర్పంచ్ జగదాంబ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.రంజాన్ పర్వదినాన్నిపురస్కరించుకుని స్థానిక మసీదు కమిటీకి ఆదివారం రూ.11,000 నగదును అందజేశారు. ఎన్నికల సమయంలో తాను సర్పంచ్‌గా గెలిస్తే విజయదశమి, క్రిస్మస్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి, రంజాన్ వంటి పండుగలకు ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు.

ఈ మేరకు ఇప్పటికే క్రిస్మస్ సందర్భంగా ఆర్థిక సహాయం అందించిన జగదాంబ, తాజాగా రంజాన్ పండుగకు కూడా రూ.11,000 అందజేసి తన మాట నిలబెట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ గౌడ్, స్థానికులు అన్నయ్యప్ప, రాజు, కాజా మియా, జమీర్, రామ్ రెడ్డి, బాబు, ఇసాక్, ఇస్మాయిల్త దితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News