ఇంద్రపాలనగరం: మాస శివరాత్రి సందర్భంగా గ్రామంలోని శ్రీ పార్వతి శంకర స్వామి గుట్టపై ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పాల్గొని స్వామివారి ఆశీస్సులు గ్రామ ప్రజలపై, పాడి పంటలపై, పశుసంపదపై ఉండాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా గ్రామంలో శాంతి, సంపదలు వర్ధిల్లాలని కోరుకున్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, సింగణబోయిన గణేష్ యాదవ్, రాజన్నగారి రమేష్, ఆలయ అధ్యక్షుడు సింగణబోయిన పాండరి యాదవ్, జోగు నర్సింహా, మర్రి శంకర్, మారసని శ్రీను, గోగికార్ నర్సొజీ, బొల్ల నర్సింహా, మండల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి