మల్కాజిగిరిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
మల్కాజిగిరిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
Editor Desk
మల్కాజిగిరి,
మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం, ఈ నెల 28న మధ్యాహ్నం సమయంలో పట్రోలింగ్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ పి. ఆనంద్, ఎస్పీఓ శశిధర్ రెడ్డితో కలిసి విధుల్లో ఉండగా మౌలాలి గాంధీనగర్ ఎక్స్రోడ్స్ వద్ద చంద్రలోక్ హైట్స్ సమీపంలో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది.
వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సుమారు 35–40 ఏళ్ల మధ్య వయస్సు గల పురుషుడి మృతదేహాన్ని గుర్తించారు. స్థానికంగా విచారణ జరిపినప్పటికీ ఎవరూ గుర్తించలేదు.
మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుని శరీర లక్షణాలు: ఓవల్ ముఖం, నల్ల జుట్టు, గడ్డం, ఎత్తు సుమారు 5.6 అడుగులు. పసుపు రంగు ఫుల్ హ్యాండ్ టీ-షర్ట్, నీలం జీన్స్ ధరించి ఉన్నాడు.
ఈ ఘటనపై క్రైమ్ నెం.349/2026గా సెక్షన్ 194 BNSS కింద కేసు నమోదు చేసి, ఎస్ఐ జె. గణేష్ బాబు దర్యాప్తు చేపట్టారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి