Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:36 PM

మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వ్యక్తిత్వ వికాస కార్యక్రమం

మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వ్యక్తిత్వ వికాస కార్యక్రమం

మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వ్యక్తిత్వ వికాస కార్యక్రమం
March 23, 2026 06:47 PM 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వ్యక్తిత్వ వికాస కార్యక్రమం

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్లేస్‌మెంట్ సెల్ మరియు కెరీర్ గైడెన్స్ సెల్ ఇంఛార్జ్ డా. ఎస్. రాజేశ్ కుమార్ ఆధ్వర్యంలో నేడు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వైస్ ప్రిన్సిపాల్ అడవి రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, సమాజంలో మంచి స్థానాన్ని సంపాదించేందుకు సానుకూల దృక్పథం ఎంతో అవసరమని అన్నారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ శశాంక్ పాలోజు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉత్తేజపరిచేలా ప్రసంగించారు. “జీవితంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం విజయానికి తొలి అడుగు” అని పేర్కొన్నారు. కల , కోరిక , లక్ష్యం మధ్య తేడాను వివరిస్తూ—కల అనేది తాత్కాలిక ఆలోచన మాత్రమే, కోరిక దానిని సాధించాలనే ఆసక్తి, కానీ లక్ష్యం మాత్రం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు నడిపించే దిశ అని స్పష్టంచేశారు.

ఇన్స్పిరేషన్, మోటివేషన్, గోల్ ఈ మూడు పరస్పరం అనుసంధానమై విజయానికి దారితీస్తాయని, వ్యక్తిత్వ వికాసానికి క్రమశిక్షణ, పట్టుదల, సానుకూల దృక్పథం కీలకమని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రముఖ మహిళా క్రీడాకారిణి అరుణిమా సిన్హా జీవిత గాథను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంతో ముందుకు సాగితే అసాధ్యాన్ని సాధ్యంగా మార్చుకోవచ్చని విద్యార్థులకు ప్రేరణనిచ్చారు.

కార్యక్రమ నిర్వాహకులు డా. ఎస్. రాజేశ్ కుమార్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్‌కు దిశానిర్దేశం చేస్తాయని, వారు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని కృషి చేయాలని సూచించారు. నేటి ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ గుణాకర్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని తెలిపారు. హిందీ లెక్చరర్ జగన్ మాట్లాడుతూ కష్టపడి పనిచేసే అలవాటు, క్రమశిక్షణే విజయానికి మూలమని వివరించారు.

చివరిగా విద్యార్థులతో ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించగా, వారు ఆసక్తిగా పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా శైలజ వ్యవహరించగా, వందన సమర్పణను పొన్నాల అరుణ చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News