మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్ర విస్తృతోపన్యాసం
మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్ర విస్తృతోపన్యాసం
Prabhakar
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మల్కాజిగిరిలో నేడు జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో విస్తృతోపన్యాసం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బండి రాజు తెలిపారు. విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహన పెంపొందించడం, విషయ పరిజ్ఞానాన్ని విస్తరించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హయత్నగర్ నుండి విచ్చేసిన ఆచార్య ఎస్. నర్సయ్య ద్వితీయ సంవత్సరం లైఫ్ సైన్సెస్ విద్యార్థులకు గామిటోజెనిసిస్ (Gametogenesis) అనే అంశంపై విస్తృతంగా ఉపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా గామిటోజెనిసిస్ ప్రక్రియ, ప్రజనన వ్యవస్థలో దాని ప్రాధాన్యం, గామీట్ల నిర్మాణం, జీవుల జీవన చక్రంలో వాటి పాత్ర వంటి అంశాలను సులభంగా వివరించారు. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని పలు ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని జంతుశాస్త్ర విభాగాధిపతి గుణాకర్ సమన్వయం చేసి విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుణాకర్ మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యాంశాలపై లోతైన అవగాహన పొందడానికి ఇలాంటి విస్తృతోపన్యాసాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. భవిష్యత్తులో కూడా విభాగం తరఫున ఇలాంటి శాస్త్రీయ కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి