భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి: ఆలయ అర్చకులు శ్యామనాథ శర్మ.
అందోల్, స్థానికం ప్రతినిధి:
సంగారెడ్డి జిల్లాలోని అందోల్ గ్రామంలో గల శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి దేవాలయం ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలకు ముస్తాబవుతుంది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చిదిరే శ్యామనాథ్ శర్మ మాట్లాడుతూ మంగళవారం ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వారా దర్శనం గల శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో స్వామి వారిని దర్శించుకోవడం ద్వారా భక్తులు తమ కోరికలను నెరవేర్చుకోగలరని అందోల్ చుట్టుపక్కల గ్రామాల నుండి మాత్రమే కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా దేవాలయానికి భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి