మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బాలకిషన్ ఘాటు వ్యాఖ్యాలు
మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బాలకిషన్ ఘాటు వ్యాఖ్యాలు
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని ఇంద్రపాలనగరం గ్రామంలో PACS–IKP వ్యవసాయ మార్కెట్పై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
ఈ నేపథ్యంలో జిల్లా నాయకుడు పూస బాలకిషన్ ఘాటుగా స్పందించారు. రైతు చెమటను ఓట్ల రాజకీయాలకు వాడుకోవడం తగదని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం IKP, PACS మార్కెట్లు సక్రమంగా నడుస్తున్నాయని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు.
ఏవైనా అనుమానాలు ఉంటే స్వయంగా వచ్చి పరిశీలించాలని, వాస్తవాలు తెలుసుకోవాలని మాజీ ఎమ్మెల్యేకు సూచించారు. బీఆర్ఎస్ నాయకులు తమ ప్రైవేట్ భూముల్లో వడ్లు పోసుకుని రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
‘ఉచితంగా స్థలం ఇచ్చారు’ అన్న వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని పేర్కొంటూ, వాస్తవాలు తెలుసుకోవాలని సవాల్ విసిరారు. ఇకపై ఇంద్రపాలనగరం IKP–PACS మార్కెట్ విషయాల్లో జోక్యం చేయవద్దని హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి