మహిళలకు డిజిటల్ ఆరోగ్య కార్డు
మహిళలకు డిజిటల్ ఆరోగ్య కార్డు
Biksham Goud
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్, మార్చి 12: మహిళల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆరోగ్య వివరాలు నమోదు చేసే డిజిటల్ ఆరోగ్య ప్రొఫైల్తో పాటు ప్రత్యేక ఆరోగ్య కార్డు అందించేందుకు చర్యలు చేపట్టింది.ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఉచితంగా సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. రక్తహీనత, మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి ముప్పై రకాల వ్యాధులను ముందుగానే గుర్తించే విధంగా పరీక్షలు చేయనున్నారు.
పరీక్షల ద్వారా వచ్చిన ఆరోగ్య వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేసి ప్రతి మహిళకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో ఆరోగ్య ప్రొఫైల్ రూపొందిస్తారు. ఈ వివరాల ఆధారంగా అవసరమైన చికిత్సలు అందించేలా ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడు దశల్లో నిర్వహించే ఈ ఆరోగ్య పరీక్షలను ఆరు నెలలలో పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నలభై ఆరు లక్షల మంది మహిళలకు ఈ సేవలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి