Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ముర్కుంజాల్ లో డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు వివేకానంద పాఠశాల 10వ వార్షికోత్సవం ఘనంగా అలరించిన చిన్నారుల నృత్యాలు – గురువులే విద్యార్థుల భవితకు మార్గదర్శకులు అంబేడ్కర్: పుస్తకాలలో కాదు, ప్రస్తుత సమాజంలో పునర్జన్మ పొందాల్సిన ఆలోచన” హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 14, 2026 08:49 PM

మహనీయుల ఆశయాలు సాధించాలి – TSUTF

మహనీయుల ఆశయాలు సాధించాలి – TSUTF

మహనీయుల ఆశయాలు సాధించాలి – TSUTF
April 14, 2026 05:05 PM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల కేంద్రంలోని మండల వనరుల కేంద్రం (ఎంఆర్సీ) ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) 13వ ఆవిర్భావ దినోత్సవం మరియు మహనీయుల జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి డి. స్వామి TSUTF పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కార్యదర్శి కంచి రవికుమార్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా ఫూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ వంటి మహనీయులు దళితులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, స్త్రీల అభ్యున్నతికి తమ జీవితాలను అంకితం చేశారని కొనియాడారు. వారి ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అదేవిధంగా ఉపాధ్యాయుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న TSUTF సంఘం 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు TSUTF జెండా ఆవిష్కరణ అనంతరం మహనీయుల చిత్రపటాలకు దండలు వేసి రెడ్ సెల్యూట్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సిల్వేరు అనిల్ కుమార్, రామన్నపేట మండల కమిటీ అధ్యక్షులు నీలం శేఖర్, ప్రధాన కార్యదర్శి మంకాల కుమారస్వామి, కోశాధికారి కర్నె త్రివేణి ప్రసాద్, ఉపాధ్యక్షులు ఘాసిరాం, FWS మండల కన్వీనర్ మేడి మధుబాబు, సీనియర్ నాయకులు సిహెచ్ మట్టారెడ్డి, జగదీశ్వరాచారి, వెంకటయ్య, జహంగీర్, కృష్ణయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు రాజు, మండల నాయకులు ఉదయ్, ఎంఆర్సీ సిబ్బంది శివకుమార్, జూనియర్ అసిస్టెంట్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News