Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 01:28 AM

మహిళా బిల్లులో ఓబీసీ ఉప కోటా ఎక్కడ?

మహిళా బిల్లులో ఓబీసీ ఉప కోటా ఎక్కడ?

మహిళా బిల్లులో ఓబీసీ ఉప కోటా ఎక్కడ?
April 28, 2026 06:51 PM 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

బీసీ కులగణన తేల్చకుంటే ప్రధాని పర్యటనను అడ్డుకుంటాం..

కేంద్రానిది పచ్చి మోసం బీసీల పట్ల బీజేపీ వైఖరి దారుణం..

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ధ్వజం..


నల్గొండ : దేశవ్యాప్తంగా సాగుతున్న జాతి జనగణనలో బీసీ కులగణనపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే, వచ్చే నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టబోయే తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. మంగళవారం నల్గొండలోని బీసీ నాయకుడు సుంకరి మల్లేష్ గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ కులగణన చేయకుండా జాతీయ జనగణనలో ప్రజలంతా పాల్గొనాలని ప్రధాని పిలుపునివ్వడం వెనుక బీసీలను మరోసారి నమ్మించి మోసం చేసే కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. గతేడాది ఏప్రిల్ 30న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సమగ్ర కులగణన చేపడతామని నిర్ణయం తీసుకున్న బీజేపీ, తీరా ఇప్పుడు అమలు చేసే సమయంలో బీసీలను విస్మరించడం పచ్చి ద్రోహమని మండిపడ్డారు.

జనగణన కోసం కేంద్రం రూపొందించిన 33 ప్రశ్నల జాబితాలో, 34వ ప్రశ్నగా బీసీ కాలమ్‌ను ఎందుకు చేర్చలేదని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. బీసీలను లెక్కించకుండా చేసే జనగణన వల్ల ఆ వర్గాలకు ఒరిగేదేమీ లేదని అసలు ప్రయోజనం లేని ఈ ప్రక్రియ ఎవరి కోసమని ఆయన నిలదీశారు. బీజేపీ నిర్వహిస్తున్న మహిళాగ్రహ సభలు కేవలం బీసీలను దగా చేసేందుకేనని ఆ పార్టీ బీసీ ద్రోహుల పార్టీగా మారిందని దుయ్యబట్టారు. మహిళా బిల్లు విషయంలోనూ కేంద్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని అందులో ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఎందుకు కల్పించడం లేదని నిలదీశారు. దేశంలోని 40 కోట్ల మంది బీసీ మహిళల ఆకాంక్షలను కాలరాస్తూ, కేవలం 10 శాతం ఉన్న అగ్రకుల మహిళల ప్రయోజనాల కోసమే ఈ బిల్లును తెచ్చారని ఆరోపించారు. మహిళా బిల్లు పేరుతో మరో 80 ఏళ్ల పాటు అగ్రకులాల వారే అధికారంలో ఉండాలని చూస్తున్నారని ఈ బిల్లు వల్ల కేవలం అగ్రకుల నాయకుల భార్యలు, కుటుంబ సభ్యులకే లబ్ధి చేకూరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన బీసీ మహిళలకు రాజకీయంగా ఏమాత్రం లాభం లేని ఈ బిల్లును తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. బీసీల డిమాండ్ల సాధన కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్, సుంకరి మల్లేష్ గౌడ్, సాయిబాబా ముదిరాజ్, గూడూరు భాస్కర్, జేల్లా ఆదినారాయణ, నల్ల మధు యాదవ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు హరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News