Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామీణ వైద్యులకు గుర్తింపు ఇవ్వాలి సుశృత 9వ వార్షికోత్సవంలో డిమాండ్ రేపు విడుదల కానున్న SSC ఫలితాలు.. పూర్తి ఏర్పాట్లు చేసిన అధికారులు రొద్దంలో వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభం రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 28, 2026 09:33 PM

మహిళా బిల్లులో ఓబీసీ ఉప కోటా ఎక్కడ?

మహిళా బిల్లులో ఓబీసీ ఉప కోటా ఎక్కడ?

మహిళా బిల్లులో ఓబీసీ ఉప కోటా ఎక్కడ?
April 28, 2026 06:51 PM 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

బీసీ కులగణన తేల్చకుంటే ప్రధాని పర్యటనను అడ్డుకుంటాం..

కేంద్రానిది పచ్చి మోసం బీసీల పట్ల బీజేపీ వైఖరి దారుణం..

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ధ్వజం..


నల్గొండ : దేశవ్యాప్తంగా సాగుతున్న జాతి జనగణనలో బీసీ కులగణనపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే, వచ్చే నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టబోయే తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. మంగళవారం నల్గొండలోని బీసీ నాయకుడు సుంకరి మల్లేష్ గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ కులగణన చేయకుండా జాతీయ జనగణనలో ప్రజలంతా పాల్గొనాలని ప్రధాని పిలుపునివ్వడం వెనుక బీసీలను మరోసారి నమ్మించి మోసం చేసే కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. గతేడాది ఏప్రిల్ 30న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సమగ్ర కులగణన చేపడతామని నిర్ణయం తీసుకున్న బీజేపీ, తీరా ఇప్పుడు అమలు చేసే సమయంలో బీసీలను విస్మరించడం పచ్చి ద్రోహమని మండిపడ్డారు.

జనగణన కోసం కేంద్రం రూపొందించిన 33 ప్రశ్నల జాబితాలో, 34వ ప్రశ్నగా బీసీ కాలమ్‌ను ఎందుకు చేర్చలేదని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. బీసీలను లెక్కించకుండా చేసే జనగణన వల్ల ఆ వర్గాలకు ఒరిగేదేమీ లేదని అసలు ప్రయోజనం లేని ఈ ప్రక్రియ ఎవరి కోసమని ఆయన నిలదీశారు. బీజేపీ నిర్వహిస్తున్న మహిళాగ్రహ సభలు కేవలం బీసీలను దగా చేసేందుకేనని ఆ పార్టీ బీసీ ద్రోహుల పార్టీగా మారిందని దుయ్యబట్టారు. మహిళా బిల్లు విషయంలోనూ కేంద్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని అందులో ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఎందుకు కల్పించడం లేదని నిలదీశారు. దేశంలోని 40 కోట్ల మంది బీసీ మహిళల ఆకాంక్షలను కాలరాస్తూ, కేవలం 10 శాతం ఉన్న అగ్రకుల మహిళల ప్రయోజనాల కోసమే ఈ బిల్లును తెచ్చారని ఆరోపించారు. మహిళా బిల్లు పేరుతో మరో 80 ఏళ్ల పాటు అగ్రకులాల వారే అధికారంలో ఉండాలని చూస్తున్నారని ఈ బిల్లు వల్ల కేవలం అగ్రకుల నాయకుల భార్యలు, కుటుంబ సభ్యులకే లబ్ధి చేకూరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన బీసీ మహిళలకు రాజకీయంగా ఏమాత్రం లాభం లేని ఈ బిల్లును తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. బీసీల డిమాండ్ల సాధన కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్, సుంకరి మల్లేష్ గౌడ్, సాయిబాబా ముదిరాజ్, గూడూరు భాస్కర్, జేల్లా ఆదినారాయణ, నల్ల మధు యాదవ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు హరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News