Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పద్మావతి నగర్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ శంకుస్థాపన డిజిటల్ దిశగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అడుగు: డిజిటల్ లైబ్రరీ ప్రారంభం 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 29, 2026 09:09 PM

మే 3న నల్గొండ ప్రోమో రన్..

మే 3న నల్గొండ ప్రోమో రన్..

మే 3న నల్గొండ ప్రోమో రన్..
April 29, 2026 07:21 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

ముఖ్య అతిథిగా హాజరుకానున్న జిల్లా కలెక్టర్..

మాదకద్రవ్యాల వ్యతిరేక చైతన్యమే లక్ష్యం..

తెలంగాణ రన్ సొసైటీ ప్రధాన కార్యదర్శి మగ్గారి శ్రీనివాస్..


నల్గొండ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, సమాజంలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా చైతన్యం కల్పించేందుకు మే 3వ తేదీన నల్గొండ పట్టణంలో ‘ప్రోమో రన్’ నిర్వహిస్తున్నట్లు సొసైటీ ఫర్ తెలంగాణ రన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మగ్గారి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన సొసైటీ ఈసీ మెంబర్ రాఘవ్, జిల్లా వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధి బండారు ప్రసాద్, డాక్టర్ పుల్లారావులతో కలిసి జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్‌ను ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మే 3న నిర్వహించే పరుగు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని కలెక్టర్‌ను కోరుతూ ఆహ్వాన పత్రం అందజేశారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పది జిల్లాల్లో తెలంగాణ రన్ పేరుతో 2కె, 5కె పరుగులను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. యువతను మాదకద్రవ్యాల బారి నుంచి రక్షించడం మరియు తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని చాటిచెప్పడమే ఈ రన్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. మే 3వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటలకు స్థానిక ఎన్జీ కళాశాల ప్రాంగణం నుండి ఈ పరుగు ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ దీనిని జెండా ఊపి ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News