Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 10:11 PM

మా గ్రామానికి బస్సు పునరుద్ధరించండి.

మా గ్రామానికి బస్సు పునరుద్ధరించండి.

మా గ్రామానికి బస్సు పునరుద్ధరించండి.
February 19, 2026 04:54 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

వలిగొండ మండలంలోని కేర్చిపల్లి గ్రామ సర్పంచ్ మద్దెల మంజుల నాగరాజు ఆధ్వర్యంలో కేర్చిపల్లి గ్రామ ప్రజలు, మహిళలు, విద్యార్థులు, కలిసి భువనగిరి బస్ డిపో మేనేజర్ కి తమ గ్రామానికి బస్సు పునరుద్ధరించాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. డిపో మేనేజర్ వెంటనే స్పందించి సోమవారం నుండి బస్ ను పునరుద్దీస్తున్నట్టు తెలిపారు.దీనిలో భాగంగా సర్పంచ్ మంజుల నాగరాజు మాట్లాడుతూ మహిళలు, వృద్ధులు హాస్పిటల్ కు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు అని తెలిపారు. టెన్త్ మరియు ఇంటర్ పరీక్షలు నడిచే సమయంలో బస్సులు రాకపోవడంతో విద్యార్థులు చాలా మానసిక ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. చాలామంది విద్యార్థులు బస్సు పాస్ తీసుకున్న తర్వాత బస్సు రాకపోవడంతో చాలా ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో, ఉప సర్పంచ్ దయ్యాల మల్లేష్, వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు బర్మా జంగయ్య, కందడి శ్రీను, చిన్నం రాములు, లోడే మల్లయ్య, సిలోజు వెంకటాచారి, దయ్యాల ముత్యాలు, ఏనుగు రంగారెడ్డి, యువకులు చిన్నం మహేష్ ,బర్మా మహేశ్,కోలా సుధాకర్, కంచి చింటు మరియు పలువురు మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. బస్సును పునరుదిస్తున్నట్టు డిపో మేనేజర్ హామీ ఇవ్వడంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News