మా గ్రామానికి బస్సు పునరుద్ధరించండి.
మా గ్రామానికి బస్సు పునరుద్ధరించండి.
Vaddeman Suresh
వలిగొండ మండలంలోని కేర్చిపల్లి గ్రామ సర్పంచ్ మద్దెల మంజుల నాగరాజు ఆధ్వర్యంలో కేర్చిపల్లి గ్రామ ప్రజలు, మహిళలు, విద్యార్థులు, కలిసి భువనగిరి బస్ డిపో మేనేజర్ కి తమ గ్రామానికి బస్సు పునరుద్ధరించాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. డిపో మేనేజర్ వెంటనే స్పందించి సోమవారం నుండి బస్ ను పునరుద్దీస్తున్నట్టు తెలిపారు.దీనిలో భాగంగా సర్పంచ్ మంజుల నాగరాజు మాట్లాడుతూ మహిళలు, వృద్ధులు హాస్పిటల్ కు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు అని తెలిపారు. టెన్త్ మరియు ఇంటర్ పరీక్షలు నడిచే సమయంలో బస్సులు రాకపోవడంతో విద్యార్థులు చాలా మానసిక ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. చాలామంది విద్యార్థులు బస్సు పాస్ తీసుకున్న తర్వాత బస్సు రాకపోవడంతో చాలా ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో, ఉప సర్పంచ్ దయ్యాల మల్లేష్, వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు బర్మా జంగయ్య, కందడి శ్రీను, చిన్నం రాములు, లోడే మల్లయ్య, సిలోజు వెంకటాచారి, దయ్యాల ముత్యాలు, ఏనుగు రంగారెడ్డి, యువకులు చిన్నం మహేష్ ,బర్మా మహేశ్,కోలా సుధాకర్, కంచి చింటు మరియు పలువురు మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. బస్సును పునరుదిస్తున్నట్టు డిపో మేనేజర్ హామీ ఇవ్వడంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి