లోక కల్యాణార్థం అయ్యప్పకు మహాపడిపూజ
లోక కల్యాణార్థం అయ్యప్పకు మహాపడిపూజ
K.RAVI
విశ్వశాంతి నెలకొనాలని ప్రార్థన
సత్యదేవ సహిత అయ్యప్ప దేవాలయంలో విషు వేడుకలు
హరిహర పుత్రుడు మణికంఠుని అనుగ్రహంతో ప్రపంచమంతా శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లాలని సత్యదేవ సహిత అయ్యప్ప దేవాలయ అధ్యక్షులు కామిశెట్టి భాస్కర్ గుప్త ఆకాంక్షించారు. బుధవారం దేవాలయంలో కేరళ నూతన సంవత్సర ప్రారంభోత్సవం (విషు పుణ్యకాలం) సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ మూలవిరాట్లకుపంచామృతాభిషేకాలు నిర్వహించి, బొబ్బిళ్ల మురళి గురుస్వామి ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో 'మహాపడిపూజ' చేపట్టారు.యుద్ధాలు ఆగి.. శాంతి వర్ధిల్లాలి:అనంతరం భాస్కర్ గుప్త మాట్లాడుతూ.. శబరిమలలో విషు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని, అదే రీతిలో ఇక్కడ కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుతం అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయ్యప్ప స్వామి దయతో ఈ యుద్ధ మేఘాలు తొలగి, ప్రపంచ దేశాల మధ్య శాంతి నెలకొనాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే, ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు పండి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన కార్యదర్శి చింతల సాయిలు, కౌన్సిలర్లు రాకేష్ రెడ్డి, ఆలే శ్రీలత చిరంజీవి, గురుస్వాములు దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, ఆంజనేయులు, అంతటి రాము గౌడ్, గుత్తికొండ సుధీర్, కిలారి రమణ, పెద్దగోని రమేష్ గౌడ్, కామిశెట్టి చంద్రశేఖర్, కంచరకుంట్ల వెంకట్ రెడ్డి, తోర్పునూరి నరసింహ గౌడ్, ఉష్కాగుల నాగరాజు గౌడ్, బొడ్డు రాజేందర్ రెడ్డి, గుర్రం వెంకటేశం, గుండెబోయిన అంజయ్య, కాసోజు లింగాచారి, కాసోజు గోవర్ధన చారి, ఓర్సు రాజు, యజ్ఞమాచారి, కాసుల వెంకటేశం, కాసోజు మధు, దాచేపల్లి శ్రీనివాస్, పాశం కృష్ణ, విరమళ్ళ యాదయ్య, గజ్జల భాస్కర్, వెల్తూరి రాజేష్, కందుల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి