Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:02 AM

లోక కల్యాణార్థం అయ్యప్పకు మహాపడిపూజ

లోక కల్యాణార్థం అయ్యప్పకు మహాపడిపూజ

లోక కల్యాణార్థం అయ్యప్పకు మహాపడిపూజ
16-04-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విశ్వశాంతి నెలకొనాలని ప్రార్థన

​ సత్యదేవ సహిత అయ్యప్ప దేవాలయంలో విషు వేడుకలు

హరిహర పుత్రుడు మణికంఠుని అనుగ్రహంతో ప్రపంచమంతా శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లాలని సత్యదేవ సహిత అయ్యప్ప దేవాలయ అధ్యక్షులు కామిశెట్టి భాస్కర్ గుప్త ఆకాంక్షించారు. బుధవారం దేవాలయంలో కేరళ నూతన సంవత్సర ప్రారంభోత్సవం (విషు పుణ్యకాలం) సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ మూలవిరాట్లకుపంచామృతాభిషేకాలు నిర్వహించి, బొబ్బిళ్ల మురళి గురుస్వామి ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో 'మహాపడిపూజ' చేపట్టారు.యుద్ధాలు ఆగి.. శాంతి వర్ధిల్లాలి:అనంతరం భాస్కర్ గుప్త మాట్లాడుతూ.. శబరిమలలో విషు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని, అదే రీతిలో ఇక్కడ కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుతం అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయ్యప్ప స్వామి దయతో ఈ యుద్ధ మేఘాలు తొలగి, ప్రపంచ దేశాల మధ్య శాంతి నెలకొనాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే, ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు పండి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన కార్యదర్శి చింతల సాయిలు, కౌన్సిలర్లు రాకేష్ రెడ్డి, ఆలే శ్రీలత చిరంజీవి, గురుస్వాములు దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, ఆంజనేయులు, అంతటి రాము గౌడ్, గుత్తికొండ సుధీర్, కిలారి రమణ, పెద్దగోని రమేష్ గౌడ్, కామిశెట్టి చంద్రశేఖర్, కంచరకుంట్ల వెంకట్ రెడ్డి, తోర్పునూరి నరసింహ గౌడ్, ఉష్కాగుల నాగరాజు గౌడ్, బొడ్డు రాజేందర్ రెడ్డి, గుర్రం వెంకటేశం, గుండెబోయిన అంజయ్య, కాసోజు లింగాచారి, కాసోజు గోవర్ధన చారి, ఓర్సు రాజు, యజ్ఞమాచారి, కాసుల వెంకటేశం, కాసోజు మధు, దాచేపల్లి శ్రీనివాస్, పాశం కృష్ణ, విరమళ్ళ యాదయ్య, గజ్జల భాస్కర్, వెల్తూరి రాజేష్, కందుల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లోక కల్యాణార్థం అయ్యప్పకు మహాపడిపూజ

Article Image

విశ్వశాంతి నెలకొనాలని ప్రార్థన

​ సత్యదేవ సహిత అయ్యప్ప దేవాలయంలో విషు వేడుకలు

హరిహర పుత్రుడు మణికంఠుని అనుగ్రహంతో ప్రపంచమంతా శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లాలని సత్యదేవ సహిత అయ్యప్ప దేవాలయ అధ్యక్షులు కామిశెట్టి భాస్కర్ గుప్త ఆకాంక్షించారు. బుధవారం దేవాలయంలో కేరళ నూతన సంవత్సర ప్రారంభోత్సవం (విషు పుణ్యకాలం) సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ మూలవిరాట్లకుపంచామృతాభిషేకాలు నిర్వహించి, బొబ్బిళ్ల మురళి గురుస్వామి ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో 'మహాపడిపూజ' చేపట్టారు.యుద్ధాలు ఆగి.. శాంతి వర్ధిల్లాలి:అనంతరం భాస్కర్ గుప్త మాట్లాడుతూ.. శబరిమలలో విషు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని, అదే రీతిలో ఇక్కడ కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుతం అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయ్యప్ప స్వామి దయతో ఈ యుద్ధ మేఘాలు తొలగి, ప్రపంచ దేశాల మధ్య శాంతి నెలకొనాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే, ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు పండి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన కార్యదర్శి చింతల సాయిలు, కౌన్సిలర్లు రాకేష్ రెడ్డి, ఆలే శ్రీలత చిరంజీవి, గురుస్వాములు దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, ఆంజనేయులు, అంతటి రాము గౌడ్, గుత్తికొండ సుధీర్, కిలారి రమణ, పెద్దగోని రమేష్ గౌడ్, కామిశెట్టి చంద్రశేఖర్, కంచరకుంట్ల వెంకట్ రెడ్డి, తోర్పునూరి నరసింహ గౌడ్, ఉష్కాగుల నాగరాజు గౌడ్, బొడ్డు రాజేందర్ రెడ్డి, గుర్రం వెంకటేశం, గుండెబోయిన అంజయ్య, కాసోజు లింగాచారి, కాసోజు గోవర్ధన చారి, ఓర్సు రాజు, యజ్ఞమాచారి, కాసుల వెంకటేశం, కాసోజు మధు, దాచేపల్లి శ్రీనివాస్, పాశం కృష్ణ, విరమళ్ళ యాదయ్య, గజ్జల భాస్కర్, వెల్తూరి రాజేష్, కందుల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News