Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:17 AM

లారీలను వెంటనే ఖాళీ చేయాలి: అదనపు కలెక్టర్ కే వెంక రెడ్డి

లారీలను వెంటనే ఖాళీ చేయాలి: అదనపు కలెక్టర్ కే వెంక రెడ్డి

లారీలను వెంటనే ఖాళీ చేయాలి: అదనపు కలెక్టర్ కే వెంక రెడ్డి
05-05-2026 274 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని రైస్ మిల్లుల వద్ద లారీల నిల్వలు లేకుండా వెంటనే ఖాళీ చేసి సెంటర్లకు పంపించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కే వెంక రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో ఉన్న విద్యా ఆగ్రో రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మిల్లులో నిల్వగా ఉన్న లారీలను వెంటవెంటనే ఖాళీ చేయించి తిరిగి కొనుగోలు కేంద్రాలకు పంపాలని యాజమాన్యానికి సూచించారు. జనంపల్లి గ్రామంలోని సాయి శ్రీ రైస్ మిల్లును కూడా సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.

మిల్లుల వద్ద సరిపడా హమాలీలు, మౌలిక సదుపాయాలు లేకపోవడంతో లారీల నిల్వలు పెరుగుతున్నాయని గమనించిన అదనపు కలెక్టర్, వెంటనే కార్మికులను పెంపొందించి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ధాన్యం దిగుమతులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డిఎం సిఎస్ హరికృష్ణ, డీసీ ఎస్ ఓ ఏ.రోజా, తహసీల్దార్ లాల్ బహుదూర్, డీటీసీయస్ బాలమణి, కె. సురేష్ రెడ్డి, ఆర్‌ఐ శోభ, జీపీఓలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లారీలను వెంటనే ఖాళీ చేయాలి: అదనపు కలెక్టర్ కే వెంక రెడ్డి

Article Image

రామన్నపేట మండలంలోని రైస్ మిల్లుల వద్ద లారీల నిల్వలు లేకుండా వెంటనే ఖాళీ చేసి సెంటర్లకు పంపించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కే వెంక రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో ఉన్న విద్యా ఆగ్రో రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మిల్లులో నిల్వగా ఉన్న లారీలను వెంటవెంటనే ఖాళీ చేయించి తిరిగి కొనుగోలు కేంద్రాలకు పంపాలని యాజమాన్యానికి సూచించారు. జనంపల్లి గ్రామంలోని సాయి శ్రీ రైస్ మిల్లును కూడా సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.

మిల్లుల వద్ద సరిపడా హమాలీలు, మౌలిక సదుపాయాలు లేకపోవడంతో లారీల నిల్వలు పెరుగుతున్నాయని గమనించిన అదనపు కలెక్టర్, వెంటనే కార్మికులను పెంపొందించి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ధాన్యం దిగుమతులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డిఎం సిఎస్ హరికృష్ణ, డీసీ ఎస్ ఓ ఏ.రోజా, తహసీల్దార్ లాల్ బహుదూర్, డీటీసీయస్ బాలమణి, కె. సురేష్ రెడ్డి, ఆర్‌ఐ శోభ, జీపీఓలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News