లారీలను వెంటనే ఖాళీ చేయాలి: అదనపు కలెక్టర్ కే వెంక రెడ్డి
లారీలను వెంటనే ఖాళీ చేయాలి: అదనపు కలెక్టర్ కే వెంక రెడ్డి
Editor Desk
రామన్నపేట మండలంలోని రైస్ మిల్లుల వద్ద లారీల నిల్వలు లేకుండా వెంటనే ఖాళీ చేసి సెంటర్లకు పంపించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కే వెంక రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో ఉన్న విద్యా ఆగ్రో రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మిల్లులో నిల్వగా ఉన్న లారీలను వెంటవెంటనే ఖాళీ చేయించి తిరిగి కొనుగోలు కేంద్రాలకు పంపాలని యాజమాన్యానికి సూచించారు. జనంపల్లి గ్రామంలోని సాయి శ్రీ రైస్ మిల్లును కూడా సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.
మిల్లుల వద్ద సరిపడా హమాలీలు, మౌలిక సదుపాయాలు లేకపోవడంతో లారీల నిల్వలు పెరుగుతున్నాయని గమనించిన అదనపు కలెక్టర్, వెంటనే కార్మికులను పెంపొందించి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ధాన్యం దిగుమతులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డిఎం సిఎస్ హరికృష్ణ, డీసీ ఎస్ ఓ ఏ.రోజా, తహసీల్దార్ లాల్ బహుదూర్, డీటీసీయస్ బాలమణి, కె. సురేష్ రెడ్డి, ఆర్ఐ శోభ, జీపీఓలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి