లక్ష్యసాధనలో విద్యార్థులు ముందుండాలి
లక్ష్యసాధనలో విద్యార్థులు ముందుండాలి
K.RAVI
రత్నం ఫౌండేషన్ సేవలు అభినందనీయం: చెరుకు శివకుమార్ గౌడ్
విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రముఖ న్యాయవాది, ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శివకుమార్ గౌడ్ అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో రత్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఎంసెట్ కోచింగ్ శిక్షణ తరగతుల ముగింపు (ఫేర్వెల్ పార్టీ) కార్యక్రమం శుక్రవారం స్థానికంగా అంగరంగ వైభవంగా జరిగింది.ముఖ్య అతిథిగా హాజరైన శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి శిక్షణను ఉచితంగా అందించాలనే సంకల్పంతో రత్నం ఫౌండేషన్ ముందుకు రావడం శుభపరిణామన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఫౌండేషన్ యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఫౌండేషన్ నిర్వాహకులు ఊదరి మల్లేష్ మాట్లాడుతూ.. విద్యార్థుల అభ్యున్నతి కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి అండగా నిలిచిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. అనంతరం రానున్న ఎంసెట్ పరీక్షల్లో విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించాలని అతిథులు ఆకాంక్షిస్తూ వారికి 'ఆల్ ద బెస్ట్' చెప్పారు.ఈ సందర్భంగా విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులను, ఉపాధ్యాయులను ఫౌండేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలోఆర్టిఐ కార్యకర్త శేఖర్
ఉపాధ్యాయులు మల్లయ్య, సురేఖ, సిరి, పుర ప్రముఖులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి