Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 06:00 AM

లక్ష్యసాధనలో విద్యార్థులు ముందుండాలి

లక్ష్యసాధనలో విద్యార్థులు ముందుండాలి

లక్ష్యసాధనలో విద్యార్థులు ముందుండాలి
May 01, 2026 07:11 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రత్నం ఫౌండేషన్ సేవలు అభినందనీయం: చెరుకు శివకుమార్ గౌడ్

విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రముఖ న్యాయవాది, ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శివకుమార్ గౌడ్ అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో రత్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఎంసెట్ కోచింగ్ శిక్షణ తరగతుల ముగింపు (ఫేర్వెల్ పార్టీ) కార్యక్రమం శుక్రవారం స్థానికంగా అంగరంగ వైభవంగా జరిగింది.​ముఖ్య అతిథిగా హాజరైన శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి శిక్షణను ఉచితంగా అందించాలనే సంకల్పంతో రత్నం ఫౌండేషన్ ముందుకు రావడం శుభపరిణామన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఫౌండేషన్ యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఫౌండేషన్ నిర్వాహకులు ఊదరి మల్లేష్ మాట్లాడుతూ.. విద్యార్థుల అభ్యున్నతి కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి అండగా నిలిచిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. అనంతరం రానున్న ఎంసెట్ పరీక్షల్లో విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించాలని అతిథులు ఆకాంక్షిస్తూ వారికి 'ఆల్ ద బెస్ట్' చెప్పారు.ఈ సందర్భంగా విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులను, ఉపాధ్యాయులను ఫౌండేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో​ఆర్టిఐ కార్యకర్త శేఖర్

​ఉపాధ్యాయులు మల్లయ్య, సురేఖ, సిరి, ​పుర ప్రముఖులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News