Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్నారుల భద్రతకు ముందడుగు – ప్రత్యేక బాల ఆరోగ్య పరీక్షలకు శ్రీకారం బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 01, 2026 09:17 PM

లక్ష్యసాధనలో విద్యార్థులు ముందుండాలి

లక్ష్యసాధనలో విద్యార్థులు ముందుండాలి

లక్ష్యసాధనలో విద్యార్థులు ముందుండాలి
May 01, 2026 07:11 PM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రత్నం ఫౌండేషన్ సేవలు అభినందనీయం: చెరుకు శివకుమార్ గౌడ్

విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రముఖ న్యాయవాది, ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శివకుమార్ గౌడ్ అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో రత్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఎంసెట్ కోచింగ్ శిక్షణ తరగతుల ముగింపు (ఫేర్వెల్ పార్టీ) కార్యక్రమం శుక్రవారం స్థానికంగా అంగరంగ వైభవంగా జరిగింది.​ముఖ్య అతిథిగా హాజరైన శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి శిక్షణను ఉచితంగా అందించాలనే సంకల్పంతో రత్నం ఫౌండేషన్ ముందుకు రావడం శుభపరిణామన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఫౌండేషన్ యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఫౌండేషన్ నిర్వాహకులు ఊదరి మల్లేష్ మాట్లాడుతూ.. విద్యార్థుల అభ్యున్నతి కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి అండగా నిలిచిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. అనంతరం రానున్న ఎంసెట్ పరీక్షల్లో విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించాలని అతిథులు ఆకాంక్షిస్తూ వారికి 'ఆల్ ద బెస్ట్' చెప్పారు.ఈ సందర్భంగా విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులను, ఉపాధ్యాయులను ఫౌండేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో​ఆర్టిఐ కార్యకర్త శేఖర్

​ఉపాధ్యాయులు మల్లయ్య, సురేఖ, సిరి, ​పుర ప్రముఖులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News