Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోగారం లో బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు గిరిజన గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం ఎస్సై చైతన్య చందర్ పై వేటు పడింది వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం నూతన పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి సామకోటి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 27, 2026 10:09 PM

లక్ష్యసాధనకు కష్టపడి చదవాలి: చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

లక్ష్యసాధనకు కష్టపడి చదవాలి: చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

లక్ష్యసాధనకు కష్టపడి చదవాలి: చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
April 27, 2026 08:36 PM 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రత్నం ఫౌండేషన్ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం శ్రమించాలని, పేద విద్యార్థుల కోసం రత్నం ఫౌండేషన్ అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని రత్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న IIT-JEE / NEET / EAPCET ఉచిత శిక్షణ తరగతులు 45 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, సోమవారం విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్, పుస్తకాలను పంపిణీ చేశారు.

ముఖ్యఅతిథిగా హాజరైన చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. సమాజంలో ఎంతోమంది ధనవంతులు ఉన్నప్పటికీ, పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడం గొప్ప విషయమన్నారు. రత్నం ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల మల్లేష్‌ను, అధ్యాపక బృందాన్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు ఈ పుస్తకాలను ఉపయోగించుకుని జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించి, తమ తల్లిదండ్రులకు, చౌటుప్పల్ పట్టణానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.​రత్నం ఫౌండేషన్ చైర్మన్ మల్లేష్ మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ విద్యార్థి కూడా ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ శిక్షణను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్టీఐ జిల్లా అధ్యక్షుడు (యాదాద్రి) దబ్బటి శేఖర్, అధ్యాపకులు యు. గణేష్, సనా, సురేఖ, సౌమ్య, శిరీష, సిరి, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News