Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:08 AM

లక్ష్యసాధనకు కష్టపడి చదవాలి: చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

లక్ష్యసాధనకు కష్టపడి చదవాలి: చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

లక్ష్యసాధనకు కష్టపడి చదవాలి: చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
27-04-2026 126 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రత్నం ఫౌండేషన్ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం శ్రమించాలని, పేద విద్యార్థుల కోసం రత్నం ఫౌండేషన్ అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని రత్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న IIT-JEE / NEET / EAPCET ఉచిత శిక్షణ తరగతులు 45 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, సోమవారం విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్, పుస్తకాలను పంపిణీ చేశారు.

ముఖ్యఅతిథిగా హాజరైన చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. సమాజంలో ఎంతోమంది ధనవంతులు ఉన్నప్పటికీ, పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడం గొప్ప విషయమన్నారు. రత్నం ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల మల్లేష్‌ను, అధ్యాపక బృందాన్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు ఈ పుస్తకాలను ఉపయోగించుకుని జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించి, తమ తల్లిదండ్రులకు, చౌటుప్పల్ పట్టణానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.​రత్నం ఫౌండేషన్ చైర్మన్ మల్లేష్ మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ విద్యార్థి కూడా ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ శిక్షణను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్టీఐ జిల్లా అధ్యక్షుడు (యాదాద్రి) దబ్బటి శేఖర్, అధ్యాపకులు యు. గణేష్, సనా, సురేఖ, సౌమ్య, శిరీష, సిరి, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

లక్ష్యసాధనకు కష్టపడి చదవాలి: చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

Article Image

రత్నం ఫౌండేషన్ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం శ్రమించాలని, పేద విద్యార్థుల కోసం రత్నం ఫౌండేషన్ అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని రత్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న IIT-JEE / NEET / EAPCET ఉచిత శిక్షణ తరగతులు 45 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, సోమవారం విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్, పుస్తకాలను పంపిణీ చేశారు.

ముఖ్యఅతిథిగా హాజరైన చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. సమాజంలో ఎంతోమంది ధనవంతులు ఉన్నప్పటికీ, పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడం గొప్ప విషయమన్నారు. రత్నం ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల మల్లేష్‌ను, అధ్యాపక బృందాన్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు ఈ పుస్తకాలను ఉపయోగించుకుని జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించి, తమ తల్లిదండ్రులకు, చౌటుప్పల్ పట్టణానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.​రత్నం ఫౌండేషన్ చైర్మన్ మల్లేష్ మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ విద్యార్థి కూడా ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ శిక్షణను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్టీఐ జిల్లా అధ్యక్షుడు (యాదాద్రి) దబ్బటి శేఖర్, అధ్యాపకులు యు. గణేష్, సనా, సురేఖ, సౌమ్య, శిరీష, సిరి, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News