లక్ష్య సాధన దిశగా కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్
లక్ష్య సాధన దిశగా కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్
Editor Desk
నల్లగొండ: విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని సాధన దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ సూచించారు.
పట్టణంలోని పద్మనగర్లో ఉన్న మిర్యాల కమలమ్మ–వెంకటేశం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించారు.
పాఠశాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న దాత మిర్యాల యాదగిరి సోదరులను కూడా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యాభివృద్ధి కోసం అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మిర్యాల యాదగిరి మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం తమ తల్లిదండ్రుల పేరుతో పాఠశాలను నిర్మించామని, భవిష్యత్తులో కూడా సహకారం కొనసాగిస్తామని తెలిపారు.
పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు:
Ch. Jessy – 558,
P. Swathi – 543,
Ch. Geethanjali – 539,
S. Sri Harishitha – 539,
S. Karunya – 530,
N. Manikanta – 527,
P. Shiva Sahithi – 505,
K. Pooja – 500.
అలాగే పాఠశాల హెడ్మాస్టర్ ఉషను కలెక్టర్ శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జాతీయ యువజన పురస్కార గ్రహీత గంజి రాజేందర్, చెరిపెల్లి జయప్రకాష్, ఉపాధ్యాయులు అనిత, విజయ్ కుమార్, నరేష్, సాఫియా, సిబ్బంది రాపోలు సుధర్మ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి