Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధన దిశగా కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ సోమందేపల్లి మండలంలో కిశోరి వికాసం శిక్షణ డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 06, 2026 12:12 PM

లక్ష్య సాధన దిశగా కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్

లక్ష్య సాధన దిశగా కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్

లక్ష్య సాధన దిశగా కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్
May 06, 2026 10:48 AM 8 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ: విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని సాధన దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ సూచించారు.

పట్టణంలోని పద్మనగర్‌లో ఉన్న మిర్యాల కమలమ్మ–వెంకటేశం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించారు.

పాఠశాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న దాత మిర్యాల యాదగిరి సోదరులను కూడా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యాభివృద్ధి కోసం అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మిర్యాల యాదగిరి మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం తమ తల్లిదండ్రుల పేరుతో పాఠశాలను నిర్మించామని, భవిష్యత్తులో కూడా సహకారం కొనసాగిస్తామని తెలిపారు.

పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు:

Ch. Jessy – 558,

P. Swathi – 543,

Ch. Geethanjali – 539,

S. Sri Harishitha – 539,

S. Karunya – 530,

N. Manikanta – 527,

P. Shiva Sahithi – 505,

K. Pooja – 500.

అలాగే పాఠశాల హెడ్‌మాస్టర్ ఉషను కలెక్టర్ శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జాతీయ యువజన పురస్కార గ్రహీత గంజి రాజేందర్, చెరిపెల్లి జయప్రకాష్, ఉపాధ్యాయులు అనిత, విజయ్ కుమార్, నరేష్, సాఫియా, సిబ్బంది రాపోలు సుధర్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News