కుషాయిగూడ డిపోలో ఘనంగా శ్రీ రామ నవమి ఉత్సవం
కుషాయిగూడ డిపోలో ఘనంగా శ్రీ రామ నవమి ఉత్సవం
Prabhakar
కుషాయిగూడ డిపోలో బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ రామ నవమి ఉత్సవ కార్యక్రమం రంగురంగుల వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి డిపో మేనేజర్ వి.వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథిగా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సాజిద్ మహమ్మద్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ శ్రీరాముడి సుగుణాలను వివరించి, ఆయన జీవితం మనందరికీ ఆదర్శమని తెలిపారు. అనంతరం సాజిద్ మహమ్మద్ మాట్లాడుతూ శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు అని, ఎల్లప్పుడూ నీతి, నిజాయితీతో జీవిస్తూ తండ్రి మాటకు కట్టుబడి వనవాసం వెళ్లిన గొప్ప వ్యక్తిత్వం అని కొనియాడారు.
తదుపరి డిపో కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు పానకం పంపిణీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ చంద్ర మౌళి , మెకానికల్ ఫోర్మెన్ వ్యాస్ , బీసీ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు కొండాపురం శ్రీనివాస్ , కార్యదర్శి . సత్యనారాయణ , వర్కింగ్ ప్రెసిడెంట్ కె ఎన్ రావు తదితరులు పాల్గొన్నారు. అలాగే అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి