Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 10:47 AM

కురుబలకు అండగా నిలుస్తాం: ఎంపీ నాగరాజు

కురుబలకు అండగా నిలుస్తాం: ఎంపీ నాగరాజు

కురుబలకు అండగా నిలుస్తాం: ఎంపీ నాగరాజు
May 04, 2026 06:22 PM 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎమ్మిగనూరు,

ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామంలో కురుబల ఆరాధ్య దైవం బీరప్ప దేవర బండార మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

వారికి కురుబ కుల బాంధవులు, గ్రామ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పూలమాలలు, డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. సుమారు 11 గుడికట్ల దేవుళ్లను పిలిపించి బండార పూజలను నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ, కురుబలకు అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు. గుడికట్ల పూజారులకు గౌరవ వేతనంగా రూ.10 వేల చొప్పున అందజేస్తామని హామీ ఇచ్చారు. కురుబల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం 20 గొర్రెలు, ఒక పొట్టేలు అందించే అంశాన్ని పరిశీలిస్తున్నదని చెప్పారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News