PRINT TIME: May 04, 2026 07:41 PM
కురుబలకు అండగా నిలుస్తాం: ఎంపీ నాగరాజు
కురుబలకు అండగా నిలుస్తాం: ఎంపీ నాగరాజు
May 04, 2026 06:22 PM
10 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఎమ్మిగనూరు,
ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామంలో కురుబల ఆరాధ్య దైవం బీరప్ప దేవర బండార మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వారికి కురుబ కుల బాంధవులు, గ్రామ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పూలమాలలు, డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. సుమారు 11 గుడికట్ల దేవుళ్లను పిలిపించి బండార పూజలను నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ, కురుబలకు అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు. గుడికట్ల పూజారులకు గౌరవ వేతనంగా రూ.10 వేల చొప్పున అందజేస్తామని హామీ ఇచ్చారు. కురుబల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం 20 గొర్రెలు, ఒక పొట్టేలు అందించే అంశాన్ని పరిశీలిస్తున్నదని చెప్పారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి