కుంకుడుపాములలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
కుంకుడుపాములలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
Editor Desk
కుంకుడుపాముల గ్రామంలో సర్పంచ్ గొలుసుల సత్తయ్య యాదవ్ ఆధ్వర్యంలో, శ్రీ చైతన్య యూత్ సహకారంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ అంబేద్కర్ సమానత్వం, మహిళల అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. గ్రామంలో అంబేద్కర్, శివాజీ విగ్రహాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల మధుసూదన్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ శిరీష, వార్డు సభ్యులు బొక్క నార్మదా, కరుణకర్ రెడ్డి, పులిగిల్ల పరమేష్, దుప్పెల్లి స్వాతి నరేష్, గ్రామ పెద్దలు బొక్క యాది రెడ్డి, బొక్క శ్రవణ్ కుమార్ రెడ్డి, బొక్క శ్రీనివాస్ రెడ్డి, కన్నెబోయిన సైదులు, మిట్టగడుపుల రాములు, పులిగిల్ల జానయ్య, వలిగొండ నర్సయ్య, గడ్డం అప్పయ్య, గడ్డం కిషోర్, పులిగిల్ల సంపత్, పులిగిల్ల వంశీ పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి