క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి : పోసానిపేట సర్పంచ్ గోపాల్
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి : పోసానిపేట సర్పంచ్ గోపాల్
Sandeep journalist
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండల పరిధిలోని పోసానిపేట గ్రామలో సంక్రాంతి పర్వదినాన్నిపురస్కరించుకొని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలోగత మూడు రోజులుగా గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో 10 జట్లు తలబడ్డాయి.మొదటి బహుమతిగా క్రాంతి యూత్ జూనియర్స్ టీం గెలుపొందడం జరిగింది.రన్నర్ బహుమతి గా మల్లికార్జున యూత్ టీంసభ్యులు గెలుపొందారు.
గెలుపొందిన వారికి గ్రామ సర్పంచ్ చేతులమీదుగా బహుమతులను అందజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని
వారు అన్నారు. యువకులు చెడు మార్గం వైపు వెళ్లకుండా పలు రకాల క్రీడలైన వాలీబాల్,
క్రికెట్,కబడ్డీ,కోకో, హై జంప్ . లాంగ్ జంప్ . ఫుట్బాల్ వంటి క్రీడల్లో రాణించాలని వారు
అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అని ఆయన కొనియాడారు
కావున విద్యార్థులు
యువకులు. చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ
సర్పంచ్,యువకులు గ్రామ ప్రజలు, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి