భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని కొత్తగూడెం వన్టౌన్ పరిధిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కవిత అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇది హత్యగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, కవిత భర్త నాగేశ్వరరావుకు తన వదినతో వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయంపై గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే నాగేశ్వరరావే కవితను హత్య చేశాడని వారు ఆరోపించారు.
ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు కొత్తగూడెం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి