Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 10:09 PM

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ సేవాదళ్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ సేవాదళ్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ సేవాదళ్
June 01, 2026 07:47 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే,మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బోనగిరి పట్టణంలో కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పచ్చలకట్ట సోమేశ్వర స్వామి దేవాలయం, శివాలయంలో ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించారు. అర్చకులు నాగరాజు పంతులు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి రాజగోపాల్ రెడ్డి ఆయురారోగ్యాలు, రాజకీయ ప్రగతి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం వృద్ధులు, వికలాంగులకు బట్టలు పంపిణీ చేయడంతో పాటు పండ్లు అందజేసి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజు మాట్లాడుతూ, రాజగోపాల్ రెడ్డి ప్రజల కోసం నిరంతరం సేవలందిస్తున్న ప్రజానాయకుడని కొనియాడారు. పేద విద్యార్థులకు, ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ అనేక మందికి సహాయం చేసిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని తెలిపారు.యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి, ఎల్లమ్మ తల్లి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రాజగోపాల్ రెడ్డి మరింత ఉన్నత స్థాయికి చేరుకుని, రాబోయే రోజుల్లో మంత్రి పదవి చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ్ జనరల్ సెక్రటరీ గుమ్మడిల్లి రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు వాజిద్ భాయ్,బోనగిరి సేవాదళ్ పట్టణ అధ్యక్షుడు సోమ రవీందర్ రెడ్డి, దరిపెల్లి ప్రవీణ్,డాకూరి ప్రకాష్,రవీందర్,శ్రీనివాస్,నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News