Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:25 AM

కొమ్మాయిగూడెంలో భగత్‌సింగ్ వర్ధంతి

కొమ్మాయిగూడెంలో భగత్‌సింగ్ వర్ధంతి

కొమ్మాయిగూడెంలో భగత్‌సింగ్ వర్ధంతి
23-03-2026 69 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కొమ్మాయిగూడెం గ్రామంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ 95వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా హైస్కూల్, ప్రైమరీ స్కూల్, అంగన్‌వాడీ కేంద్రంలో భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్ఎఫ్ఐ మాజీ మండల నాయకుడు శానగొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. భగత్‌సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానుభావుడని, ఆయన స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు.

విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి సమాజానికి ఉపయోగపడేలా ఎదగాలని పిలుపునిచ్చారు. భగత్‌సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు యువత కృషి చేయాలని అన్నారు.

అనంతరం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు శానగొండ రామచంద్రం, గ్రామ అధ్యక్షుడు జల్లెల మల్లేశం, కార్యదర్శి ఆకిటి శ్రీను, ఎస్ఎఫ్ఐ నాయకుడు సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కొమ్మాయిగూడెంలో భగత్‌సింగ్ వర్ధంతి

Article Image

కొమ్మాయిగూడెం గ్రామంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ 95వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా హైస్కూల్, ప్రైమరీ స్కూల్, అంగన్‌వాడీ కేంద్రంలో భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్ఎఫ్ఐ మాజీ మండల నాయకుడు శానగొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. భగత్‌సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానుభావుడని, ఆయన స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు.

విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి సమాజానికి ఉపయోగపడేలా ఎదగాలని పిలుపునిచ్చారు. భగత్‌సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు యువత కృషి చేయాలని అన్నారు.

అనంతరం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు శానగొండ రామచంద్రం, గ్రామ అధ్యక్షుడు జల్లెల మల్లేశం, కార్యదర్శి ఆకిటి శ్రీను, ఎస్ఎఫ్ఐ నాయకుడు సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News