కోదాడ పోస్టాఫీస్ కు నూతన భవనం మంజూరు చేయాలి
ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన పోస్టాఫీస్ నూతన సాధన కమిటీ సభ్యులు
కోదాడ పట్టణంలో పోస్టాఫీస్ కు శాశ్వత నూతన భవనం మంజూరు చేయాలని కోరుతూ పోస్టాఫీస్ నూతన భవన సాధన కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. కమిటీ అధ్యక్షుడు గంధం బంగారు మాట్లాడుతూ.. ప్రస్తుతం అద్దె భవనాల్లో పోస్టాఫీస్ కొనసాగుతోందని, దీనివల్ల ప్రజలకు సరైన సౌకర్యాలు అందడం లేదని, స్థలాభావంతో సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కోదాడ వంటి అభివృద్ధి చెందుతున్న పట్టణానికి సొంత భవనం అవసరమని ఆయన పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి